కణమాంలో గ్రావెల్ దందా
ఆనందపురం మండలం కణమాం పంచాయతీ పరిధిలో కొండలు, వాటి మధ్య ఎటు వైపు వెళ్లినా రియల్ ఎస్టేట్ లేఅవుట్లు దర్శనమిస్తాయి. జగనన్న కాలనీ, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేవుట్), ఏపీఐఐసీకి కేటాయించిన భూములన్నీ కొండలకు ఆనుకొనే ఉంటాయి.
ముఠా ఆగడాలను అడ్డుకున్న ఏపీఐఐసీ భూబాధిత రైతులు
కణమాంలో ఏపీఐఐసీకి కేటాయించిన భూముల్లో నుంచి గ్రావెల్ తరలించిన ప్రాంతం...వాహనాన్ని అడ్డుకున్న రైతులు
ఆనందపురం, న్యూస్టుడే: ఆనందపురం మండలం కణమాం పంచాయతీ పరిధిలో కొండలు, వాటి మధ్య ఎటు వైపు వెళ్లినా రియల్ ఎస్టేట్ లేఅవుట్లు దర్శనమిస్తాయి. జగనన్న కాలనీ, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేవుట్), ఏపీఐఐసీకి కేటాయించిన భూములన్నీ కొండలకు ఆనుకొనే ఉంటాయి. వీటిలో పనుల పేరిట కొందరు స్థానిక వైకాపా నాయకులు రెండేళ్లుగా గ్రావెల్ దందాకు పాల్పడుతున్నారు. ఇటీవల రహదారి నిర్మాణానికి భారీ యంత్రాలతో రాత్రి, పగలు గ్రావెల్ తరలిస్తున్నారు. ఇప్పటి వరకు జగనన్న కాలనీ లేఅవుట్ చదును పేరిట గ్రావెల్ తరలించినా.. అభివృద్ధి కోసమే కదా అనే భావనతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.
* ఏపీఐఐసీ భూముల్లో: కణమాం రెవెన్యూ గ్రామంలో సుమారు 150 ఎకరాల కొండ ఏటవాలు ప్రాంతాన్ని గత ప్రభుత్వం ఏపీఐఐసీ సంస్థకు కేటాయించింది. దీనికి సంబంధించి దస్త్రాల ప్రక్రియ పూర్తి కావస్తున్నప్పటికీ సంబంధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇక్కడా తవ్వేస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు గనుల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంబంధిత వ్యక్తులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. బుధవారం ఉదయం కూడా గ్రావెల్ తవ్వకాలు చేపట్టడంతో రైతులు అడ్డుకోగా అక్కడి నుంచి యంత్రాలను హుటాహుటిన వేరొక చోటకు తరలించారు.
* కేసు నమోదు చేసినా..: రైతుల ఫిర్యాదుతో గనుల శాఖ అధికారులు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినా ఏపీఐఐసీకి కేటాయించిన భూముల్లోనూ, పక్కనే ఉన్న ఎంఐజీ లేవుట్ నుంచి గ్రావెల్ తరలించడంపై రైతులు అధికార యంత్రాంగంపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అక్రమార్కులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో కేసు మాఫీ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. తమకు నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని, లేకుంటే ఊరుకోబోమని బాధిత రైతులు అంటున్నారు. కణమాంలో గ్రావెల్ తరలింపు వ్యవహారాన్ని.. తహసీల్దార్ రామారావు వద్ద ప్రస్తావించగా దీనిపై తనకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు