logo

బాబు రాకతో కోలాహలం

విశాఖ, అచ్యుతాపురంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు.

Published : 01 Jun 2023 04:27 IST

ఎన్‌ఏడీకూడలి, పరవాడ, అచ్యుతాపురం, న్యూస్‌టుడే

పోర్టు స్టేడియంలో వివాహ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

విశాఖ, అచ్యుతాపురంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రోడ్డు మార్గాన బయలుదేరిన చంద్రబాబునాయుడు.. పర్యటన పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు విమానాశ్రయం నుంచి తిరుగుపయనమయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలు  పాల్గొన్నారు.

* చంద్రబాబు పాల్గొన్న  ప్రతి కార్యక్రమంలోనూ అభిమానుల కోలాహలం కనిపించింది.  పోర్టు స్డేడియం, బీచ్‌రోడ్డు ఎంజీఎం పార్కు వద్దకు చంద్రబాబు వచ్చిన సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున అభివాదం చేశారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

విమానాశ్రయంలో చంద్రబాబునాయుడుకి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్సీ చిరంజీవిరావు,
చిత్రంలో మాజీమంత్రి గంటా, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, అనిత, తదితరులు

పరవాడలో ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

అచ్యుతాపురంలో..

ఎంజీఎం పార్కులో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని