logo

తెదేపా మేనిఫెస్టోతో వైకాపా నాయకుల్లో వణుకు

చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలివిడత మేనిఫెస్టోతో వైకాపా నాయకుల గుండెల్లో దడ మొదలైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Published : 01 Jun 2023 04:27 IST

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

సమావేశంలో మాట్లాడుతున్న అనిత

పాయకరావుపేట, న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలివిడత మేనిఫెస్టోతో వైకాపా నాయకుల గుండెల్లో దడ మొదలైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతకు పెద్దపీట వేసిన పథకాలు చూసి వెన్నుల్లో వణుకు మొదలైందని పేర్కొన్నారు. వైకాపా పాలనతో జనం విసిగిపోయారని చెప్పారు. పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ గాడిలో పెట్టాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడే రావాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నారని వివరించారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి పనులు చేపట్టే సత్తా చంద్రబాబుకే ఉందని అనిత చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని