అమ్మకానికి జగనన్న ఇళ్లు!
జగనన్న ఇళ్ల కాలనీ వ్యవహారం చోడవరంలో ప్రారంభం నుంచి ప్రహసనంగా తయారైంది. ఇళ్ల నిర్మాణాలు అన్ని గుత్తేదారు చేస్తాడు అంటూ అధికార పార్టీ నాయకులు చెప్పడంతో నగదు చెల్లించి లబ్ధిదారులు మోసపోయారు.
లబ్ధిదారుల అవసరాలు.. దళారుల ప్రలోభాలు
అనధికారికంగా చేతులు మారుతున్న స్థలాలు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, చోడవరం, న్యూస్టుడే
అమ్మకాలు జోరుగా సాగుతున్న నర్సయ్యపేట లేఅవుట్ ఇదే..
జగనన్న ఇళ్ల కాలనీ వ్యవహారం చోడవరంలో ప్రారంభం నుంచి ప్రహసనంగా తయారైంది. ఇళ్ల నిర్మాణాలు అన్ని గుత్తేదారు చేస్తాడు అంటూ అధికార పార్టీ నాయకులు చెప్పడంతో నగదు చెల్లించి లబ్ధిదారులు మోసపోయారు. ఇదొక పెద్ద కుంభకోణంగా మిగిలింది. ఈ వివాదం ముగియకముందే మరో వ్యవహారం తెర పైకి వచ్చింది. జగనన్న లేఅవుట్లో అమ్ముతామంటూ ఇళ్ల పట్టా వివరాలు సామాజిక మాధ్యమాలలో పెడుతున్నారు. దీనిపై పరిశీలించగా పలు అంశాలు వెలుగుచూశాయి. దాదాపు 200కి పైగా ఇంటి స్థలాల అమ్మకాలు జరిగాయి. దాదాపు రూ.కోటికి పైగా నగదు చేతులు మారింది. ఈ అమ్మకాలలో లబ్ధిదారుల కన్నా స్థిరాస్తి వ్యాపారం చేసే మధ్యవర్తులే బాగా లబ్ధి పొందారు. ప్రస్తుతం చోడవరంలో జగనన్న లేఅవుట్లో స్థలం రూ.లక్షన్నర నుంచి రూ.పది లక్షల వరకు ధర పలుకుతోంది.
చోడవరం నుంచి చీడికాడ వెళ్లే రహదారి పక్కన నర్సయ్యపేట రెవెన్యూ భూమిలో 1, 2, 3 పేరిట వై.ఎస్.ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలుగా మూడు లేఅవుట్లను రెవెన్యూ వర్గాలు వేశాయి. ఈ మూడు లేఅవుట్లలో 528 మందికి ఇళ్లు కేటాయించారు. చోడవరం పట్టణ ప్రజలతో పాటు నర్సయ్యపేట, లక్ష్మీపురం, గాంధీగ్రామం, శ్రీరామపట్నం, అంకుపాలెం, దామునాపల్లి గ్రామాలకు చెందిన ఇళ్లు లేని నిరు పేదలకు ఇళ్ల స్థల పట్టాలను అందజేశారు. 2022 ఫిబ్రవరి 2న అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు చేతులమీదుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించారు. ఏడాదిలో పూర్తి చేసి సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభోత్సవాలు చేయిస్తామని ప్రభుత్వ విప్ ధర్మశ్రీ ప్రకటించారు. నేటికి పూర్తయినవి 12 ఇళ్లే. ఇవి కాక చోడవరం నుంచి సింహాద్రిపురం వెళ్లే దారిలో వాటర్ వర్క్స్ వద్ద వేసిన మరో లేఅవుట్లో 238 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు.
* చోడవరం వాటర్ వర్స్క్ వద్ద లేఅవుట్లో 132 ప్లాట్ నం. రాయి సత్యవతి. ఈమెది పి.ఎస్.పేట గ్రామం. తనకు కేటాయించిన స్థలం అమ్ముతానంటూ వాట్సాప్లో పోస్టు చేశారు. 72 గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్ రూ. లక్షన్నరకు అమ్ముతారని ఆమె పేరున ఎం.నాగరాజు అనే వ్యక్తి వివిధ వాట్సాప్ గ్రూప్లలో సమాచారం పెట్టాడు. ఇళ్ల స్థలం పట్టాతో పాటు సరిహద్దులు తెలిపే ఫామ్ గ్రూప్లో ఉంచాడు.
అధికారులు ఏమంటున్నారంటే...
జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్ల కొనుగోలు చేయడం నేరమని హౌసింగ్ ఏఈ రమణమూర్తి అన్నారు. ఇళ్ల అమ్మకాలు జరుగుతున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఎవరు కొనుగోలు చేసినా హక్కులన్నీ పట్టాదారులకే ఉంటాయి. కోర్టుకు వెళ్లినా చెల్లదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. అమ్మకాలు జరిపినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఏఈ రమణమూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు. తహసీల్దారు ఎల్.తిరుమలబాబు మాట్లాడుతూ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. అమ్మినట్లు పక్కాగా రుజువులతో తేలితే పట్టాను రద్దు చేస్తామని తెలిపారు.
నర్సయ్యపేట లేఅవుట్లో 40 శాతం పైగా కాలనీ ఇళ్ల అమ్మకాలు జరిగిపోయాయి. పునాదులు తీసిన తన ఇంటి స్థల పట్టాను పది లక్షలకు అమ్ముతానంటూ ఓ లబ్ధిదారుడు స్థిరాస్తి వ్యాపారం చేసే మధ్యవర్తులకు తెలిపాడు. ఇక్కడ రహదారి పక్కన ఉన్న స్థలాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. రూ.ఏడు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు అమ్మకాలు జరిగాయి. రహదారికి దూరంగా ఉండే ఖాళీ స్థలాలు రెండున్నర లక్షలకు అమ్ముతున్నారు. ప్రభుత్వమిచ్చే రుణంతో కలిపి స్థలం కావాలంటే రూ.ఆరు లక్షలు లేదా రుణం అవసరం లేకుండా కేవలం ఖాళీ ఇంటి స్థల పట్టా కావాలంటే రూ.రెండున్నర లక్షలుగా అమ్మకాలు సాగుతున్నాయని ఓ మధ్యవర్తి ‘న్యూస్టుడే’కు తెలిపారు. నర్సయ్యపేట లేఅవుట్లో లబ్ధిదారుల కంటే కొనుగోలు చేసుకున్న కొత్త వ్యక్తులే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటుండటం గమనార్హం. అధికారులు లోతుగా పరిశీలిస్తే అమ్మకాలు బయటపడతాయి. నర్సయ్యపేట జగనన్న లేఅవుట్ స్థిరాస్తి వ్యాపారంలో ఉండే మధ్యవర్తులకు అడ్డాగా మారిపోయింది.
చీడికాడ రహదారిలో నర్సయ్యపేట రెవెన్యూలో వేసిన లేఅవుట్కు 2022లో గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు ఆవిష్కరించిన శంకుస్థాపన శిలాఫలకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
నామినేషన్ల పర్వం నేటి నుంచి
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 18-04-2024]
శ్రీరామనవమి సందర్భంగా బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణంతో శ్రీరామ గిరులు తరించాయి. -
వైకాపా రెబల్గా వంతల రామన్న
[ 18-04-2024]
అరకులోయలో అసెంబ్లీ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు వైకాపా నాయకుడు వంతల రామన్న తెలిపారు. అరకులోయలో బుధవారం తన మద్దతుదారులు, వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 18-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
జానకి రాముల కల్యాణం.. జగమంతా సంబరం
[ 18-04-2024]
మాడుగుల గవర వీధిలో కొలువైన వైభోగ సీతారాముల కల్యాణోత్సవం బుధవారం రాత్రి ఆలయం ప్రాంగణంలో కనులపండువగా జరిగింది. -
కూటమికి మద్దతుగా వేల కి.మీ. బైకుపై ప్రచారం
[ 18-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ
[ 18-04-2024]
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. -
మద్యంతో పోలీసులకు చిక్కిన సూపర్వైజర్
[ 18-04-2024]
మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వైకాపా మద్దతుదారుడే నాయకులకు, కార్యకర్తలకు మద్యం సీసాలు అందిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. -
ఎండలతో పర్యటక ప్రాంతాలు వెలవెల
[ 18-04-2024]
పర్యటక ప్రాంతం మారేడుమిల్లిలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా సుమారు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవడం గమనార్హం. -
బైకు అదుపుతప్పి ఆర్మీ ఉద్యోగి దుర్మరణం
[ 18-04-2024]
బైకు అదుపుతప్పి కల్వర్టు వద్ద కాలువలో పడిన ఘటనలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. చీడికాడ మండలం పెదగోగాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. -
అసౌకర్యాల అరకులోయ
[ 18-04-2024]
ఆంధ్రాఊటీ అరకులోయ పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాదిరిగా ఉంది. ఈ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నారు. -
నీటి పథకం మోటారుకు మరమ్మతులు
[ 18-04-2024]
మారేడుమిల్లిలోని పంపు హౌస్లో మోటార్కు మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా నిర్మించిన మినీ ట్యాంక్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. -
ఆదివాసీ హక్కులను రక్షించే వారినే బలపర్చండి
[ 18-04-2024]
మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడలో ఇండియా కూటమిని గెలిపించాలని సీపీఎం నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. -
బెల్లం పులుపు ధ్వంసం
[ 18-04-2024]
పెదబొడ్డేపల్లి సమీపంలోని తోటల్లో నిల్వ ఉంచిన బెల్లం పులపును నర్సీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ధ్వంసం చేశారు. -
‘రాజీనామా చేయాలని వాలంటీర్లపై ఒత్తిడి’
[ 18-04-2024]
మండలంలో పనిచేస్తున్న వాలంటీర్లు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని సీపీఎం మండల కార్యదర్శి నాగులు బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ