బదిలీల సందడి.. సిఫార్సులు దండి!
ప్రభుత్వశాఖల్లో సాధారణ బదిలీల సందడి కొనసాగుతోంది. కొన్నిశాఖల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. నేతలతో పైరవీలు చేయించుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది.
ఈనాడు డిజిటల్, పాడేరు, అనకాపల్లి
ప్రభుత్వశాఖల్లో సాధారణ బదిలీల సందడి కొనసాగుతోంది. కొన్నిశాఖల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. నేతలతో పైరవీలు చేయించుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేందరూ సిఫార్సు లేఖలు ఇచ్చారు.. కొందరైతే ఇద్దరేసి ఎమ్మెల్యేలు, మంత్రుల లేఖలు జతచేసి మరీ దరఖాస్తులిచ్చారు. ఉద్యోగ సంఘాల పేరుతో మరికొందరు ఒత్తిళ్లు తెచ్చారు.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బదిలీల జాబితాను తయారు చేసి కలెక్టర్ ఆమోదంతో ఉత్తర్వులు జారీచేస్తున్నారు. కొన్నిశాఖలు ఇంకా బదిలీల వివరాలను బయటపెట్టడం లేదు.
జలవనరుల శాఖలో..
ఇంజినీరింగ్ అధికారుల బదిలీల ప్రక్రియ ఈఎన్సీ కార్యాలయంలో జరుగుతోంది. ఆ జాబితా రెండు రోజుల తర్వాత వస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఎస్ఈ పరిధిలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర క్యాడర్లకు సంబంధించి బదిలీలు పూర్తిచేశారు. వారిలో దీర్ఘకాలం ఒకేచోట పనిచేసిన ఒకరిద్దరిని దూర ప్రాంతానికి బదిలీ చేయకుండా సర్కిల్ నుంచి డివిజన్ కార్యాలయానికి కదిపి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బదిలీలపై కొంతమంది ఫిర్యాదుకు సిద్ధమవుతున్నారు.
డీఆర్డీఏ పరిధిలో..
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) పరిధిలో గతేడాది బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి రావాల్సిన సిబ్బంది సిఫార్సులు కారణంగా రాలేకపోయారు. దీంతో ఈ ఏడాది ముందే మేల్కోని అక్కడ సిబ్బంది కలెక్టర్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. దీనిపై సంబంధిత అధికారికి కలెక్టర్ కాల్ చేసినా స్పందించలేదని సమాచారం. దీంతో నేరుగా సెర్స్ సీఈవోతోనే మాట్లాడి అక్కడి నుంచే బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యేలా చేసినట్లు తెలిసింది. పాడేరు నుంచి తొమ్మిది మంది వివిధ క్యాడర్ల సిబ్బంది ఈ సారి మైదాన ప్రాంతానికి బదిలీ అయ్యారు. విశాఖపట్నం నుంచి మరో ఏడుగురికి బదిలీలు చేశారు. వారిలో కొంతమంది సిఫార్సులతో డిప్యుటేషన్లు రద్దు చేయించుకున్నట్లు సమాచారం.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో..
అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో 11 మంది, అల్లూరి జిల్లాలో అయిదుగురు పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం కల్పించారు. అనకాపల్లి నుంచి ఏజెన్సీకి ముగ్గురు కార్యదర్శులను పంపిస్తున్నారు. ఏజెన్సీ నుంచి కొంతమంది కిందకు రావడానికి ప్రయత్నించినా బదిలీల్లో వారికి చోటులేకుండా చేసినట్లు తెలిసింది. సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శుల బదిలీల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది.
వైద్యారోగ్య శాఖలో.. ఏపీఎన్జీవో వివాదం
వైద్యారోగ్య శాఖ బదిలీల్లో పారదర్శకత లోపిస్తోందని కొందరు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఏపీఎన్జీవో ఎన్నికల నిర్వహణలో లోపముందని.. మార్గదర్శకాలేవీ పాటించకుండా సభ్యులను ఎన్నుకున్నారని పిటీషన్లో పేర్కొన్నారు. దీనిపై ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసేవరకు ఆర్థికపరమైన అంశాల్లోగానీ, బదిలీల్లోగానీ ఆ సంఘం సభ్యుల ప్రభావం ఉండకూడదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ బదిలీల నుంచి ఈసారి ఏపీఎన్జీవో నేతలకు మినహాయింపు ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ విషయమై వైద్యారోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు ఉమాసుందరి వద్ద ప్రస్తావించగా ఆ వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిపై కలెక్టర్కు నోట్ఫైల్ పెట్టి ఆయన ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్