చెత్తపై చిత్తశుద్ధి ఏదీ?
నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ అటకెక్కింది. తడి-పొడి చెత్త వేరు చేసే దగ్గరి నుంచి వర్మీకంపోస్టు తయారీ వరకు ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు.
తడి-పొడి వేరు చేయకుండానే కాపులుప్పాడకు తరలింపు
అలంకార ప్రాయంగా తరలింపు కేంద్రాలు
ఈనాడు-విశాఖపట్నం, కార్పొరేషన్-న్యూస్టుడే
తడి-పొడి చెత్త వేరే చేసేందుకు ప్రత్యేకంగా షెడ్డు
నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ అటకెక్కింది. తడి-పొడి చెత్త వేరు చేసే దగ్గరి నుంచి వర్మీకంపోస్టు తయారీ వరకు ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. కాపులుప్పాడలో వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్న యార్డు వద్దకే అన్ని వ్యర్థాలు తరలిస్తున్నప్పుడు కొత్తగా షెడ్లను, వర్మీకంపోస్టు యంత్రాలను ఏర్పాటు చేయడంపై అనుమానాలు రేగుతున్నాయి. కమీషన్లపై ఆశలు... స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు వచ్చినప్పుడు చూపించుకోవడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయనే విమర్శలున్నాయి.
* అన్నీ కలిపేసి..: ఘన వ్యర్థాల నిర్వహణ- 2016 నిబంధన ప్రకారం ఇళ్ల నుంచి తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. జీవీఎంసీ పరిధిలో దాదాపు 5.43 లక్షల గృహాలున్నాయి. తడి, పొడి చెత్తతోపాటు ప్రమాదకర చెత్తను సేకరించేందుకు ప్రతి ఇంటికి మూడు రకాల బిన్స్ (చెత్త బుట్టలు) సరఫరా చేయాలి. నగరంలో క్లాప్ వాహనాలు 608 ఉండగా, అందులో 578 వాహనాలు నిత్యం చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. ఈ వాహనాల్లో క్యాబిన్లు సైతం తడి-పొడి చెత్తకు వేర్వేరుగా ఉంటాయి. ప్రజలకు అవగాహన పెంచినా చాలా చోట్ల కార్మికులు రెండు రకాల చెత్తను వేరుగా వేయకుండా కలిపి క్లాప్ వాహనాల్లో కుక్కేస్తున్నారు.
* ఇక్కడే నిధులు వ్యర్థం: చెత్త తరలింపు కేంద్రాల్లో తడి-పొడి చెత్త వేరు చేయడానికి ఒక షెడ్డు, వర్మీకంపోస్టు తయారీకి యంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.15-20లక్షలు ఖర్చు చేస్తున్నారు. చీమలాపల్లి, ముడసర్లోవ, అప్పుఘర్, పాత నగరం, గాజువాక, భీమిలిలో ఇవి ఉన్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ ఇక్కడ తూతూమంత్రమే. వాస్తవానికి లక్ష్యం ఏంటంటే... నగరంలో ప్రతిరోజూ 1100 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. 700 టన్నులు కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలిస్తూ...
దాదాపు 400 టన్నుల వ్యర్థాలను ఈ కేంద్రాల వద్దనే వేరు చేసి వర్మీకంపోస్టు, పొడి చెత్తలో కొన్నింటిని పునర్వినియోగానికి వేరు చేయాలి. ఇలా చేస్తేనే ఘనవ్యర్థాల నిర్వహణ లక్ష్యం నెరవేరినట్లు. అయితే విశాఖలో ఆ పరిస్థితి లేదు.
ప్రాజెక్టు వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు?:
కాపులుప్పాడలో వేస్ట్ ఎనర్జీ ప్లాంటును అందుబాటులోకి తెచ్చారు. భవన నిర్మాణ వ్యర్థాలు మినహా మిగిలిన వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. తడి-పొడి చెత్త వేరు చేయకుండా నేరుగా ఈ ప్లాంటులో వేసినా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నప్పుడు, ఉన్న వాటిలో లక్ష్యం దిశగా కార్యాచరణ లేనప్పుడు తరలింపు కేంద్రాలు ప్రత్యేకంగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏంటనేది నగరవాసుల ప్రశ్న. తాజాగా రూ.20లక్షలతో మేయర్ ఇటీవల మరో కేంద్రం ఏర్పాటు చేయడం గమనార్హం. కొందరు అధికారులు కేవలం కమీషన్ల కోసమే ఇలాంటి కేంద్రాలు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నారనే విమర్శలున్నాయి.
* రైతులకు అవగాహన శూన్యమే: తరలింపు కేంద్రాలకు తెచ్చిన చెత్తను వేరు చేయడానికి 50 నుంచి 100 మందిని ఈ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలి. కేంద్రాలకు క్లాప్ వాహనాల ద్వారా వచ్చే పొడి చెత్తలోని అట్టలు, పేపర్లు, ప్లాస్టిక్ వేరు చేయాలి. అలా వేరు చేసిన వాటిలో తిరిగి ఉపయోగించే వాటిని అమ్ముకుంటారు. తడి చెత్తలో కూరగాయలు, హోటళ్ల వ్యర్థాలను సేకరించి వర్మీకంపోస్టు తయారు చేసి రైతులకు అందజేయాలి. ఈ కేంద్రాలకు రైతులు వచ్చేలా అవగాహన కల్పించొచ్చు. అదీ జరగడం లేదు. ఇక్కడ వర్మీకంపోస్టు పూర్తిస్థాయిలో తయారు చేయడం లేదు. చేసిన కొంత కూడా మూలకు పడేస్తున్నారు.
వర్మీకంపోస్టు తయారీ యంత్రాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు