మొక్కుబడిగా...సాయంత్రం ఓపీలు
కేజీహెచ్లో ఏడు విభాగాల్లో ప్రారంభమైన ‘సాయంత్రం ఓపీ’లకు రోగుల తాకిడి అంతంత మాత్రంగానే ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోజుకు ఒక్కో విభాగానికి ఒకరిద్దరు మాత్రమే వస్తున్నారు.
పూర్తిస్థాయిలో దృష్టిసారించని అధికారులు
ఓపీల నిర్వహణపై తనిఖీలు చేస్తున్న సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ వాసుదేవ్
వన్టౌన్, న్యూస్టుడే: కేజీహెచ్లో ఏడు విభాగాల్లో ప్రారంభమైన ‘సాయంత్రం ఓపీ’లకు రోగుల తాకిడి అంతంత మాత్రంగానే ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోజుకు ఒక్కో విభాగానికి ఒకరిద్దరు మాత్రమే వస్తున్నారు. కొన్ని విభాగాలకు అసలు రావడమే లేదు. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ రోగులు రాకపోవడంతో కొద్దిసేపు వేచి చూసి వారు సైతం వెనుదిరుగుతున్నారు.
* కేజీహెచ్లో ప్రసూతి, చర్మవ్యాధులు, మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆర్థో తదితర విభాగాల ఓపీలకు ఉదయం పూట రద్దీ ఎక్కువగా ఉంటోంది. నిత్యం ప్రతి విభాగానికి సుమారు 100 మంది వరకు రోగులు వస్తుంటారు. రద్దీ పెరిగితే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య అందించలేని పరిస్థితి. దీంతో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
గంట సమయం సరిపోదని..
గతంలో ఎన్నడూ సాయంత్రం పూట ఓపీలు నిర్వహించిన దాఖలాలు లేవు. తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టారు. అయితే కేవలం గంట సేపు మాత్రమే చూస్తుండడం, అదీ మధ్యాహ్న భోజన వేళకు అటుఇటుగా ప్రారంభమవుతుండడంతో రోగులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేజీహెచ్లో సాధారణంగా ఉదయం పూట ఓపీలు 9గంటలకు ప్రారంభమవుతాయి. ఓపీ చీటీల కోసం భారీ వరుస ఉంటుంది. చీటీ తీసుకొని వైద్యుని వద్దకు వెళ్లి, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొనే సరికి మధ్యాహ్నం 2గంటలు దాటిపోతోంది. ఉదయం పూట వస్తే కనీసం మూడు, నాలుగు గంటల సేపు పడుతోంది. అటువంటిది సాయంత్రం కేవలం గంట సమయంలో వైద్యుని సంప్రదింపులు, పరీక్షలు చేయించుకోవడం జరిగే పనికాదని పలువురు వెనుకంజ వేస్తున్నారు. కనీసం రెండు గంటల సేపైనా ఓపీలు నిర్వహిస్తే రోగులు పెరుగుతారని చెబుతున్నారు. దూర ప్రాంత వాసులు కాకున్నా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారైనా వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏడు విభాగాలకు కలిపి 10మందే..
కేజీహెచ్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఈ కారణంగా మధ్యాహ్నం ఓపీ వేళలను 3 గంటల నుంచి 4గంటల వరకు ఖరారు చేశారు. ఈ సమయం అనుకూలంగా లేకపోవడంతో రోగుల నుంచి స్పందన రావడం లేదు. ఆసుపత్రి సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ వాసుదేవ్ ప్రతీరోజూ సాయంత్రం పూట ఓపీలు నిర్వహిస్తున్నదీ లేనిదీ తనిఖీలు చేస్తున్నారు. ఏడు విభాగాలకు కలిపి రోజుకు 10 మంది వరకు వస్తున్నారని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళుతున్నారు.
ప్రచారం లేకపోవడమూ కారణమే..
మధ్యాహ్నం ఓపీల నిర్వహణపై అనుకున్నంత స్థాయిలో ప్రచారం లేదు. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తున్నామనే ధోరణిలో వైద్యాధికారులు ఉన్నారే తప్పా ఎక్కడా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయలేదు. రోగులు, వారి సహాయకులకు అవగాహన కల్పించడం లేదు. వైద్య సిబ్బంది గంటపాటు అందుబాటులో ఉండడమంటే సాధారణ విషయం కాదు. ఒక గంటలో కనీసం 20 మందిని వైద్యులు పరీక్షిస్తారు. ప్రయివేటుకు వెళితే కేవలం వైద్యుల కన్సల్టేషన్ ఫీజు రూ.300 నుంచి రూ.500 వరకు తీసుకుంటారు. అలాంటిది ఇక్కడ విలువైన వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి. మధ్యాహ్నం ఓపీలపై ప్రచారం నిర్వహించి, సమయం పెంచి చిత్తశుద్ధితో నిర్వహిస్తే పేద రోగులకు మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో మాఫియాల స్వైర విహారం: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
[ 24-04-2024]
ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు