పూడిమడకలో వింత పాములు
పూడిమడక ఉప్పుటేరులో శుక్రవారం వింతపాములు ప్రత్యక్షమయ్యాయి. మత్స్యకార నాయకుడు మేరుగు ప్రవీణ్కుమార్ వీటి ఫొటోలు, వీడియోలు మత్స్యశాఖ అధికారులు పంపించారు.
అచ్యుతాపురం, న్యూస్టుడే: పూడిమడక ఉప్పుటేరులో శుక్రవారం వింతపాములు ప్రత్యక్షమయ్యాయి. మత్స్యకార నాయకుడు మేరుగు ప్రవీణ్కుమార్ వీటి ఫొటోలు, వీడియోలు మత్స్యశాఖ అధికారులు పంపించారు. ఇక్కడి అధికారులు వీటిపై ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి లక్ష్మణరావు మాట్లాడారు. వీటిని సిసిలియన్ల జాతికి చెందినవిగా గుర్తించామన్నారు. నీటిలోనూ, మెత్తటి భూమిపైనా జీవించే ఇవి ఉష్ణ మండల సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయన్నారు. వీటికి తలా, తోక ఎటువైపు ఉన్నాయో? తెలుసుకోవడం కష్టమన్నారు. ఆహారంగా తీసుకోవడానికి పనికిరావని, ఇవి నదులు, సముద్రాలు కలిచేచోట నేల వదులుగా ఉండే ప్రాంతాల్లో ఆకుచెత్త, చిన్నచిన్న కప్పలు, పురుగులను ఆహారంగా తీసుకొంటాయన్నారు. వీటి నోట్లో డజన్ల కొద్ది సూదిలాంటి పదునైన దంతాలు ఉంటాయన్నారు. ఇతర జంతువుల నుంచి కాపాడుకోవడానికి వీటి చర్మానికి ఉన్న గ్రంధుల ద్వారా విషాన్ని విడుదల చేసి కాపాడుకుంటాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 120 రకాలైన సిసిలియన్లు రకాలు ఉన్నాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం