logo

నేటి నుంచి మహిళల టీ-20 ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ మహిళల టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లు విజయనగరం నార్త్‌జోన్‌ క్రికెట్‌ అకాడమీలో ఈనెల 4 నుంచి 11 వరకు జరుగుతాయని ఏసీఏ(ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌) కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు.

Published : 04 Jun 2023 04:50 IST

మాట్లాడుతున్న యాంకర్‌ రష్మీ గౌతమ్‌

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ మహిళల టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లు విజయనగరం నార్త్‌జోన్‌ క్రికెట్‌ అకాడమీలో ఈనెల 4 నుంచి 11 వరకు జరుగుతాయని ఏసీఏ(ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌) కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం విశాఖ వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా ప్రీమియర్‌లీగ్‌ మహిళల టీ-20 పోటీలు జరగడం ఇది రెండో సారని తెలిపారు. గత ఏడాది మహిళల టీ-20 మ్యాచ్‌లు నిర్వహించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రచారకర్త, యాంకర్‌ రష్మీ గౌతమ్‌ మాట్లాడుతూ మహిళల క్రికెట్‌కు ఆంధ్రా క్రికెట్‌ సంఘం తోడ్పాటు అందిస్తోందన్నారు. క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించేందుకు తల్లులు ముందుకు రావాలని కోరారు. ఏసీఏ సీఈఓ శివారెడ్డి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని