logo

భద్రతలో పోర్టు అథారిటీకి అవార్డు

సేఫ్టీ ఎక్స్‌లెన్స్‌లో అత్యుత్తమ పనితీరు కనబరించినందుకు పోర్టు అథారిటీకి గ్రీన్‌ టెక్‌ ఫౌండేషన్‌ అవార్డు లభించింది. వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు, సంస్థ పురోగతికి, ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను పరిశీలించి ఏటా గ్రీన్‌ టెక్‌ సంస్థ అవార్డులు ప్రదానం చేస్తుంది.

Published : 04 Jun 2023 05:48 IST

అవార్డు అందుకుంటున్న పోర్టు డిప్యూటీ సీఎంఈ రవికుమార్‌

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: సేఫ్టీ ఎక్స్‌లెన్స్‌లో అత్యుత్తమ పనితీరు కనబరించినందుకు పోర్టు అథారిటీకి గ్రీన్‌ టెక్‌ ఫౌండేషన్‌ అవార్డు లభించింది. వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు, సంస్థ పురోగతికి, ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను పరిశీలించి ఏటా గ్రీన్‌ టెక్‌ సంస్థ అవార్డులు ప్రదానం చేస్తుంది. ఇటీవల న్యూదిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ సీఎంఈ రవికుమార్‌కు గ్రీన్‌ టెక్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు అవార్డు అందజేశారు. ఈ ఘనత సాధించిన సిబ్బందిని పోర్టు ఛైర్మన్‌ ఎం.అంగముత్తు ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు