ముగిసిన నాటకోత్సవాలు
అనకాపల్లి జార్జిక్లబ్ ఆవరణలోని కొణతాల వెంకట నారాయణమ్మ కళా ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన నాటకోత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి.
బాలనాగమ్మ నాటకంలో ఓ సన్నివేశం
అనకాపల్లి, న్యూస్టుడే: అనకాపల్లి జార్జిక్లబ్ ఆవరణలోని కొణతాల వెంకట నారాయణమ్మ కళా ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన నాటకోత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు మొత్తం ఆరు నాటికలు ప్రదర్శించారు. వైకే నాగేశ్వరరావు నాటక కళాపరిషత్, ఆదిలీలా ఫౌండేషన్ సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేశాయి. చివరిరోజు గుంటూరు వారి ‘నాన్నా నేనొచ్చేస్తా’, చిలకలూరిపేట వారి ‘ఆలితో సరదాగా’ నాటికలను ప్రదర్శించారు. పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఏవిధంగా చెడిపోతున్నారో నాన్నా నేనొచ్చేస్తా నాటిక ద్వారా చూపించారు. పెళ్లయిన ఆడపిల్ల అత్తవారింటిలో వచ్చే చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలే కాని తరచూ పుట్టింటికి వచ్చేస్తానని చెప్పడం తగదనే ఇతివృత్తంతో నాటిక సాగింది. అమృతలహరి దర్శకత్వం వహించగా తాళాబత్తుల వెంకటేశ్వరరావు కథను అందించారు. హస్య భరితంగా సాగిన ఆలీతో సరదాగా నాటిక అందరిని ఆలోచింపచేసేదిగా ఉంది. షేక్ షఫీ దర్శకత్వం వహించగా అద్దెపల్లి భరత్ కుమార్ రచించారు. జార్జిక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బుద్ధ కాశీవిశ్వేశ్వరరావు, మళ్ల చంద్రశేఖర్, కోశాధికారి ఆళ్ల శ్రీను, నాటకోత్సవాల కన్వీనర్ కె.ఎం.నాయుడు, కళాపరిషత్ ప్రతినిధులు బొప్పన నరసింగరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మైమరపించిన బాలనాగమ్మ నాటకం
మాడుగుల, న్యూస్టుడే: మోదకొండమ్మ జాతర సందర్భంగా మహారాజా కోటలో మూడు రోజులుగా హైదరాబాద్కు చెందిన సురభి నాటక సంస్థ నాటక ప్రదర్శనలు ఆహూతులను కట్టి పడేస్తున్నాయి. ఆదివారం రాత్రి బాల నాగమ్మ నాటక ప్రదర్శనలో మాయల ఫకీరు వేషధారణ, కార్యవర్థిరాజు బాలవర్థిరాజు బాలనాగమ్మ నటనతో పాటు మాయల ఫకీరు మహల్లో పిశాచాల ధ్వని, హాహాకారాల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టు కున్నాయి. ఎంపీపీ రామధర్మజ, సర్పంచి కళావతి, కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు, శ్రీనాథు శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు తిలకించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.