పోర్టులో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసుకుంటూ విశాఖ పోర్టు అథారిటీ ముందుకు సాగుతోందని పోర్టు ఛైర్మన్ ఎం.అంగముత్తు తెలిపారు.
ఛైర్మన్ ఎం.అంగముత్తు
సౌర విద్యుత్తు ప్రాజెక్టు
జగదాంబకూడలి, న్యూస్టుడే: అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసుకుంటూ విశాఖ పోర్టు అథారిటీ ముందుకు సాగుతోందని పోర్టు ఛైర్మన్ ఎం.అంగముత్తు తెలిపారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోర్టు చేపట్టిన పలు పర్యావరణ హిత చర్యలను ఆయన వివరించారు. ‘ప్రధాని మోదీ ప్రకటించిన పంచామృత్ కార్యక్రమం అమలు దిశగా అడుగులు వేస్తున్నాం. హరిత్ సాగర్ మార్గదర్శకాలు-2023ను అనుసరించి పోర్టు బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ను రూపొందించే పనిలో ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువగా పోర్టు సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. మరో 15 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు అవసరమైన భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. సీఎన్జీ, మిథనాల్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ను వినియోగించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రూ.116.4 కోట్లతో నాలుగు కవర్డ్ స్టోరేజ్ యార్డుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దీనిలో 2,94,000 మెట్రిక్ టన్నుల సరకును నిల్వ చేయవచ్చు. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2024 నాటికి దీన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నిల్వ సరకు నుంచి దుమ్ము గాలిలోకి చేరకుండా 100 ఎకరాల్లోని 8 కార్గో స్టోరేజ్ యార్డ్లపై 221 వాటర్ స్ప్లింకర్స్ ద్వారా నిత్యం నీటిని వెదజల్లుతున్నాం. పోర్టు పరిసరాలను శుభ్రం చేసేందుకు ఒక మెకానికల్ స్వీపింగ్ యంత్రం అందుబాటులో ఉంది. స్టాక్ యార్డ్లు, రైల్వే గూడ్స్పై టార్పలిన్ కప్పడం ద్వారా దుమ్ముపైకి లేవకుండా చర్యలు తీసుకుంటున్నాం.
630 ఎకరాల్లో గ్రీన్బెల్ట్
* పోర్టులోని 630 ఎకరాల్లో 5,65,000 మొక్కలతో గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేశాం. స్వచ్ఛ సాగర్ కార్యక్రమంలో భాగంగా ఆర్కేబీచ్ వద్ద ఒక కిలోమీటరు తీర ప్రాంతాన్ని పోర్టు దత్తత తీసుకొంది. నగరం నుంచి సముద్రంలో కలిసే మూడు గెడ్డల వద్ద తెలియాడే చెత్తను 18నెలలపాటు తొలగించాం. పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఏటా రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆయా చర్యలకుగాను 2022లో పోర్టుకు గ్రీన్టెక్ ఎన్విరాన్మెంట్ అవార్డును లభించింద’ని ఛైర్మన్ అంగముత్తు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!