logo

దేవరాపల్లిలో లగేజీ ఆటో దగ్ధం

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వెంకటరాజుపురం సమీపాన ఆదివారం సరకులు రవాణా చేస్తున్న ఆటో దగ్ధమైంది.

Updated : 05 Jun 2023 10:43 IST

దేవరాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వెంకటరాజుపురం సమీపాన ఆదివారం సరకులు రవాణా చేస్తున్న ఆటో దగ్ధమైంది. ఎన్‌టీఆర్‌ జిల్లా నందిగామ గ్రామానికి చెందిన ఆటో యజమాని నాయిని దుర్గాప్రసాద్‌ వాయిదాల పద్ధతిపై గృహోపకరణాలను గ్రామాల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. చీడికాడ మండలం నుంచి దేవరాపల్లి వస్తుండగా ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇతని కుమారుడు త్రినాథ్‌ బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంలో రూ.మూడు లక్షల విలువైన ఆటోతో పాటు రూ.రెండు లక్షల విలువైన గృహోపకరణాలు కాలిపోయాయి. సర్పంచి సంతోష్‌తో పాటు స్థానికులు పరుగున వెళ్లి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న కొత్తవలస అగ్నిమాపక శకటం మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయింది. వస్తువులు మొత్తం కాలిపోయాయని బాధితులు బోరున విలపించారు. జీవనాధారం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని