సీఆర్ఎస్ విచారణలో రైల్వే ఉద్యోగులు?
ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషన్ (సీఆర్ఎస్) ఇప్పటికే రంగంలోకి దిగింది.
టీటీఈలు, ఇతర సిబ్బంది నుంచి వివరాల సేకరణ
ఈనాడు, విశాఖపట్నం : ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషన్ (సీఆర్ఎస్) ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆ ఘటనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న రైల్వే ఉద్యోగులను విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పలువురు ఉద్యోగులను పిలిపించి వారి నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ రైలు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన ఉద్యోగుల నుంచి ప్రాథమిక వివరాలు తీసుకున్నారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో మొత్తం అయిదుగురు టిక్కెట్ తనిఖీ అధికారు(టీటీఈ)లు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగానే ఉన్నారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ముగ్గురు కుర్దా డివిజన్కు చెందిన వారవగా యశ్వంత్పూర్-హవ్డాలో ఉన్న ఇద్దరు టీటీఈలు ఖరగ్పూర్కు చెందినవారు. వీరు చిన్నపాటి గాయాలతో బయటపడినప్పటికీ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నట్లు తెలిసింది. ఈ నెల 2న జరిగిన దుర్ఘటనలో ఖరగ్పూర్ కంట్రోల్రూంకు టీటీఈనే మొదటిగా సమాచారం చేరవేసినట్లు తెలిసింది. రైళ్లు ఢీకొన్నాయి.. అధిక సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారన్న సమాచారాన్ని చెప్పారు. ప్రస్తుతం వీరంతా సీఆర్ఎస్ విచారణలో ఉన్నారు. ఈ సందర్భంగా వారి నుంచి.. ప్రమాదం జరగడానికి కొంత సమయం ముందు నుంచి, జరిగిన తరువాత వరకు చోటుచేసుకున్న వివిధ పరిణామాలు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగినపుడు ఏ కోచ్లో ఉన్నారు? అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? వంటి వివరాలతో పాటు కొన్ని అనుమానాలకు సంబంధించిన విశ్వసనీయ ప్రశ్నలు వారిని అడిగినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా స్టేషన్ సిబ్బంది, ఇతర సాంకేతిక విభాగాల ఉద్యోగులను విచారిస్తున్నట్లు సమాచారం.
అందుకే పక్కా లెక్క
తీవ్ర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్-హవ్డా రైళ్లలో రిజర్వేషన్ బోగీల ప్రయాణికుల విషయంలో ఎటువంటి గందరగోళం ఏర్పడలేదు. ఈ రైళ్లు ఏఏ స్టేషన్ల వద్ద ఆగింది, అక్కడ ఎంతమంది ఎక్కారు, ఎంతమంది దిగారు వంటి వివరాలు స్పష్టంగా దొరికాయి. దీంతో చాలా వరకు ఆ సమాచారం ఇతర రాష్ట్రాల ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడానికి చాలా దోహదపడింది. ఈ వివరాలు ఇంత స్పష్టంగా రావడం వెనుక టీటీఈలకు ఇచ్చిన ట్యాబ్లే కారణమని సీనియర్ టీటీఈలు పేర్కొంటున్నారు. అంతకుముందు చార్టుల్లో వివరాలు నమోదు చేసేవారు. అప్పట్లో రైలు బోగీల్లో టీటీఈల వద్ద ఉండే రిజర్వేషన్ చార్టులే అత్యంత కీలకం. ఎక్కిన వారి వద్ద రౌండ్ చేసుకునేవారు. ఏ రిజర్వేషన్ బోగీలో ఎంతమంది ఎక్కారు, ఎక్కడెక్కడ ఎక్కారు, రిజర్వేషన్ చేసుకొని ఎక్కని వారు ఎందరు? వారికి బదులుగా ఎక్కిన వారి వివరాలు నమోదు చేసుకునేవారు. పెద్ద ప్రమాదాలపుడు ఆ చార్టులు ధ్వంసమయ్యేవి. చిరిగి కనిపించకుండా పోయేవి. ఆ సమయంలో వాటిని వెతకడమూ ఇబ్బందే. ఇన్ని ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఎప్పటికప్పుడు ఆ వివరాలు నమోదు చేయడంతో ఆ సమాచారం అంతా కంట్రోల్రూంకు చేరి నిక్షిప్తం అవుతుంది. ఒడిశా ఘటనలో ఇది చాలా ఉపయోగపడిందంటున్నారు. ఈ కారణంగానే యశ్వంత్పూర్లో ఏపీ వాసులు ఏ స్టేషన్ల వద్ద ఎంతమంది ఎక్కారు, కోరమాండల్లో ఎక్కడెక్కడ ఎంతమంది దిగుతారో అన్న వివరాలు ఉన్నాయంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
[ 25-04-2024]
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా