వాహనమే లేదు..విజిలెన్స్ ఎట్టా?
గనుల శాఖలో విజిలెన్స్ విభాగం చాలా కీలకమైంది. అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలన్నా.. సహజ వనరుల దోపిడీని నిలువరించాలన్నా విజిలెన్స్ అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది.
గనులశాఖలో కొలిక్కిరాని కార్యాలయాల విభజన
జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
ఆనందపురం మండలంలో ఇటీవల అక్రమ తవ్వకాలు జరిగిన ఏపీఐఐసీ భూములు
ఈనాడు, పాడేరు : గనుల శాఖలో విజిలెన్స్ విభాగం చాలా కీలకమైంది. అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలన్నా.. సహజ వనరుల దోపిడీని నిలువరించాలన్నా విజిలెన్స్ అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. నిత్యం క్షేత్రస్థాయిలో ఉండి నిరంతరం తనిఖీలు చేయాల్సిన విభాగం అధికారులు బయట అడుగు పెట్టడానికి ముందు వాహనం కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.
ఎస్.రాయవరం మండలం గుడివాడలో గుట్టుగా సాగిస్తున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలు
నెల రోజుల క్రితం గనుల శాఖను కొత్త జిల్లాలవారీగా విభజించారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లా మొత్తంగా విజిలెన్స్ అధికారిని నియమించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ విజిలెన్స్ కార్యాలయానికి వాహన సదుపాయం మాత్రం కల్పించలేదు. దీంతో గస్తీ తిరగాలన్నా.. ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నా వాహనం లేక ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలోని జిల్లా మైనింగ్ కార్యాలయ వాహనాన్నే రెండు విభాగాల అధికారులూ వినియోగించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల సకాలంలో అక్రమ మైనింగ్పై దాడులు చేయలేని పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ అండతో స్థానిక నేతలే ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వేస్తూ తరలించేస్తున్నారు. వారం వారం స్పందనలోనూ వీటిపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. తరుచూ దాడులు చేసి భారీగా జరిమానాలు విధించినప్పుడే అక్రమ మైనింగ్కు కొంతయినా అడ్డుకట్ట పడుతుంది. అలా దాడులు చేయాలంటే అధికారులు క్షేత్రస్థాయికి సకాలంలో చేరుకుంటేనే సాధ్యమవుతుంది. మరి వాహనమే లేకుంటే అధికారులు ఎలా వెళతారు.. అక్రమ తవ్వకాలను ఎలా అడ్డుకుంటారో సంబంధిత ఉన్నతాధికారులకే తెలియాలి. వారం రోజుల క్రితం ఆనందపురం మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై స్థానికులు గనుల శాఖకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విభాగానికి వాహనం లేకపోవడంతో జిల్లా మైనింగ్ అధికారి వాహనాన్ని అడిగి తీసుకుని వెళ్లారు. అప్పటికే అక్కడ తవ్విన గ్రావెల్ అంతటిని అక్రమార్కులు మాయం చేయగా తవ్విన పరిమాణాన్ని అంచనా వేసి జరిమానా విధించి వచ్చేశారు. వారు వెళ్లిన తర్వాత మళ్లీ తవ్వకాలకు అక్రమార్కులు బరితెగించడం విశేషం.
వాహనాన్ని పంచుకోవడమే కాదు.. విజిలెన్స్ విభాగానికి ప్రత్యేకంగా కార్యాలయం కూడా లేదు. జిల్లా మైనింగ్ అధికారి కార్యాలయంలోనే వీరు కొంత స్థలంలో సర్దుకొని విధులు నిర్వహిస్తున్నారు.
మూడు జిల్లాల పర్యవేక్షణ బాధ్యత
విజిలెన్స్ బృందం నిత్యం క్షేత్రస్థాయిలోనే ఉండాలి. ఏ మార్గంలో అక్రమ మైనింగ్ రవాణా జరుగుతుందో సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గస్తీ కాసి వాహన తనిఖీలు చేపట్టాలి. అనుమతులు లేకుండా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం.. స్థానిక పోలీసు స్టేషన్కు అప్పగించడం.. భారీగా అపరాధ రుసుములు విధించడం చేయాలి. ప్రతినెలా సుమారు రూ. 10 లక్షల వరకు జరిమానా రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి. అదే సమయంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలపై దాడులు చేయాలి. క్వారీలు, క్రషర్లలోనూ తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. పైగా విజిలెన్స్ బృందం ఒక్క జిల్లాకే పరిమితం కాదు.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో తిరగాల్సి ఉంటుంది. వీరి విభాగం ఏర్పాటై నెల రోజులైనా కార్యాలయం, వాహనం లేకపోవడంతో తనిఖీలు విశాఖ జిల్లాకే పరిమితమవుతున్నాయి. అనకాపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది.
సమన్వయం చేసుకుంటున్నాం..:
వాహనం కోసం ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టామని ఈనెలలో అందుబాటులోకి వస్తుంది. వాహనం లేకపోయినంత మాత్రాన విధులకు ఇబ్బంది ఏమీ లేదు. ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం, తనిఖీలు చేపట్టి జరిమానాలు విధిస్తున్నాం. కొత్త కార్యాలయం కాబట్టి అన్ని సౌకర్యాలు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆలోగా జిల్లా మైనింగ్ అధికారితో సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నాం.
డి.ఇ.వి.ఎస్.ఎన్.రాజు, గనులశాఖ విజిలెన్స్ అధికార
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)