పరిశ్రమల్లో భద్రత ప్రమాణాల తనిఖీలు
పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై భద్రత ప్రమాణాల తనిఖీ (సేఫ్టీ ఆడిట్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రవి వెల్లడించారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) గ్రీన్జోన్ పరిధిలో ఏపీఐఐసీ, అటవీశాఖ ఆధ్వర్యంలో 5 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు.
కలెక్టర్ రవికి మొక్కలను బహూకరిస్తున్న జడ్ఎం త్రినాథరావు
అచ్యుతాపురం, న్యూస్టుడే: పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై భద్రత ప్రమాణాల తనిఖీ (సేఫ్టీ ఆడిట్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రవి వెల్లడించారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) గ్రీన్జోన్ పరిధిలో ఏపీఐఐసీ, అటవీశాఖ ఆధ్వర్యంలో 5 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ పరిశ్రమలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, కార్మికశాఖ, అగ్నిమాపకశాఖల ఆధ్వర్యంలో నిపుణులు జిల్లాలో ఇప్పటివరకు 150 పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ పూర్తి చేశారన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఈ తనిఖీలు ఉపయోగ పడతాయన్నారు. కంపెనీల్లో భద్రతాపరంగా ఉన్న లోపాలు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల కమిటీ కంపెనీలకు సిఫార్స్ చేయడంతోపాటు వాటిని అమలు చేసేలా కార్యాచరణతో పనిచేస్తుందన్నారు. పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతోపాటు కార్మికుల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రతాపరమైన లోపాలు గుర్తించిన కంపెనీలకు ఇప్పటికే నోటీసులు అందించామన్నారు. కంపెనీల భద్రతపై సలహాలు, ఫిర్యాదులు నిరంతరం స్వీకరిస్తామన్నారు.
హరిత అనకాపల్లి సాధనకు కలిసిరండి
హరిత అనకాపల్లి జిల్లా సాధనకు అందరూ కలిసిరావాలని కలెక్టర్ రవి పిలుపునిచ్చారు. జిల్లాలో జులై నెలాఖరు నాటికి 10 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనిలో అందరూ భాగస్వాములై ఒక్కో మొక్కను నాటాలని కోరారు. భవిష్యత్తు తరాలకు ఆస్తులతోపాటు మంచి వాతావరణ ఇవ్వాలనేది సంకల్పమన్నారు. ప్రతి పరిశ్రమ వ్యక్తిగత లక్ష్యాలను పెట్టుకొని 2 వేల మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వశాఖలకు లక్ష్యాలను నిర్దేశించి మొక్కలు నాటిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుతామని ఏపీఐఐసీ అధికారులు, కలెక్టర్, వివిధ కంపెనీల ప్రతినిధులతో అటవీశాఖ డీఎఫ్ఓ లక్ష్మణ్ ప్రతిజ్ఞ చేయించారు. యొకహోమా టైర్ల తయారీ పరిశ్రమ ప్లాంట్ హెడ్ ప్రహ్లాదరెడ్డి, రామరాజు, ఐఓసీ కంపెనీ హెడ్ ప్రసాద్, ఏపీఐఐసీ జడ్ఎం త్రినాథరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాసరావు, పరిశ్రమలశాఖ జీఎం శ్రీధర్, ఎఫ్ఆర్ఓ లావణ్య, ఏఈ శ్రీనివాసరావు, సీఈటీపీ ప్లాంట్ పర్యావరణ ఇంజినీర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల