పెంచుడేనా.. పంచుడేదీ..!
భూముల మార్కెట్ విలువను ఎప్పటికప్పుడు సవరిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర సర్కారు ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు.. అదే సమయంలో భూములు, స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా స్థానిక సంస్థలకు సమకూరాల్చిన నిధులను విదల్చకుండా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోంది.
భూముల మార్కెట్ విలువ భారీగా పెంచిన సర్కారు
స్టాంప్ డ్యూటీ సర్ఛార్జీ విడుదలలో స్థానిక సంస్థలకు మొండిచేయి
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, నక్కపల్లి, ఎలమంచిలి
భూముల మార్కెట్ విలువను ఎప్పటికప్పుడు సవరిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర సర్కారు ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు.. అదే సమయంలో భూములు, స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా స్థానిక సంస్థలకు సమకూరాల్చిన నిధులను విదల్చకుండా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోంది. ఇప్పటికే పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకుంది. ఇతర మార్గాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను కూడా అడ్డుకోవడంతో గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే పడకేశాయి. పంచాయతీల్లో చిన్నచిన్న అవసరాలను కూడా తీర్చలేకపోతున్నామని సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు.
వద్దనబట్టేనా..?
సర్ఛార్జీ నిధుల్ని స్థానిక సంస్థల ఖాతాల్లో వేయకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ల శాఖకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. అందుకే జిల్లా రిజిస్ట్రార్ జానకీదేవిని వీటి వివరాలు గురించి పలుమార్లు అడిగినా స్పందించడానికి ఇష్టపడలేదు. డీపీవో శిరీషారాణిని అడిగితే ఆ నిధులు నేరుగా పంచాయ తీలకు జమవుతాయని, వాటి గురించి సమాచారం లేదని చెప్పారు.
బకాయిలు అధికంగా రావల్సిన నక్కపల్లి గ్రామం
రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్థానిక సంస్థలకు ఇలా..
పురపాలక సంఘం, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు, బహుళ అంతస్తుల భవనాలు క్రయవిక్రయాలు జరిగితే స్టాంప్ డ్యూటీ సర్ఛార్జీ కింద అమ్మిన ఆస్తి విలువలో 1.5 శాతం సొమ్మును ఆయా స్థానిక సంస్థల ఖాతాలో వేయాలి. ఈ నిధులను పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు వచ్చే వాటా ప్రకారం ట్రెజరీ ద్వారా ఆయా ఖాతాలకు సర్దుబాటు చేస్తుంటారు. సాధారణంగా నెల రోజుల్లో జరిగిన ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి చెల్లించాల్సిన స్టాంప్డ్యూటీ సర్ఛార్జీ వివరాలు ప్రతినెలా ఒకటో తేదీన రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పంచాయతీల వారీగా ప్రొసీడింగ్స్ను ఖజానాకు పంపిస్తారు.
ఖజానా నుంచి పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు నిష్పత్తి ప్రకారం జమ చేస్తుంటారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఈ నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఉంటుంది.
రూ.కోట్లలో బకాయిలు..
అనకాపల్లి జిల్లాలో పది సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో రోజుకు సుమారు 300 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వీటి ద్వారా స్టాంప్ డ్యూటీగా 6.5 శాతం వసూలు చేస్తారు. అందులో 1.5 శాతాన్ని స్థానిక సంస్థలకు జమచేయాలి. ఈ మొత్తాన్ని గతేడాది డిసెంబర్ నుంచి ప్రభుత్వం విడుదల చేయలేదు. అనకాపల్లి జిల్లాలో ఈ బకాయిలు సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయని అంచనా.
* మేజర్ పంచాయతీ నక్కపల్లికి దాదాపు రూ. ఏడు లక్షల వరకు స్టాంప్ డ్యూటీ సర్ఛార్జీ బకాయి ఉంది. ప్రస్తుతం ఖాతాలో రూ. 20 వేలు మాత్రమే ఉంది. ఇక్కడ 14 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు వేతనాలకింద రూ. 1.7 లక్షలు ఇవ్వాలి. ఇలా మూడు నెలలుగా పెండింగ్ ఉంది. స్టాంపు డ్యూటీ నగదు ఖాతాకు చేరితే ఇలాంటి వారికి వేతనాలు చెల్లించడంతో పాటు, పారిశుద్ధ్య తదితర వాటికి వినియోగించే అవకాశం కలిగేది.
* ఎలమంచిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిధిలో గత ఏడాది డిసెంబరు నుంచి ఈ సొమ్మును ఖాతాలకు వేయడం మానేశారు. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన సొమ్ములు రూ.50 లక్షలపైనే ఉందని అధికారులు చెబుతున్నారు.
సకాలంలో జమయ్యేలా చూడాలి: పంచాయతీలో నిధుల కొరత ఉంది. స్టాంపు డ్యూటీ కింద రావల్సిన సొమ్మును సకాలంలో ఇస్తే పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది జీతాలు తదితర అవసరాల నిమిత్తం వినియోగించగలం. దీనిపై ఎవరిని అడగాలో తెలియడంలేదు. ఉన్నతాధికారులు చొరవ చూపి సకాలంలో జమయ్యేలా చూడాలి.
పోతంశెట్టి రాజేష్, సర్పంచి, కాగిత
సొంత సొమ్ము పెట్టాల్సి వస్తోంది..: ఎలమంచిలి మండలంలోని పోతిరెడ్డిపాలెం పంచాయతీకి ఆరునెలుల సొమ్ము జమచేయలేదు.మాకు రావాల్సింది ఎంత అన్నది అడిగినా చెప్పడంలేదు. నలుగురుస్వీపర్లు ఉన్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వమే వాడేసుకుంది. పంచాయతీలో ఏపని చేద్దామన్నా నిధులు లేవు. సొంత సొమ్ము ఖర్చుపెట్టి పరిపాలన చేస్తున్నాం.
ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, సర్పంచ్, పోతిరెడ్డిపాలెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ