దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయ్..!
వాల్తేరు డివిజన్లో విశాఖ రైల్వేస్టేషన్ పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయి.. కాని స్టేషన్కు ఉన్న ప్రతిబంధకం కారణంగా ఇక్కడికొచ్చిన ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్లాలి.
విశాఖ స్టేషన్కు రాని 10 రైళ్లు
ప్లాట్ఫామ్లపై రద్దీయే కారణం
విశాఖపట్నం, న్యూస్టుడే
ఉత్తర సింహాచలం రైల్వేస్టేషన్
వాల్తేరు డివిజన్లో విశాఖ రైల్వేస్టేషన్ పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయి.. కాని స్టేషన్కు ఉన్న ప్రతిబంధకం కారణంగా ఇక్కడికొచ్చిన ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్లాలి. దీని కోసం ఇంజిన్ మార్చాల్సి రావడంతో 20నిమిషాల వరకు ప్లాట్ఫామ్పై ఉండాల్సిన పరిస్థితి. ఫలితంగా మరిన్ని రైళ్లు విశాఖ స్టేషన్కు వచ్చే అవకాశం లేకుండా పోతోంది.
విశాఖ స్టేషన్లోని ఒక్కో ప్లాట్ఫామ్ పైన సరాసరి రోజుకు 4గంటల చొప్పున రైళ్లు నిలిచి ఉంటున్నాయని అంచనా.. సాధారణంగా విజయవాడ తదితర పెద్ద స్టేషన్లలో రైళ్లు 5 నుంచి 10 నిమిషాలు ఆగుతాయి. ఈ లెక్కన తీసుకుంటే విశాఖ స్టేషన్లో రెట్టింపు సమయం వృథా అవుతోంది. ఈ కారణంగానే పలు రైళ్లను దువ్వాడ మీదుగా నడపాల్సి వస్తోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉత్తర సింహాచలం స్టేషన్ మీదుగానే 10 రైళ్లు దువ్వాడ వెళుతున్నాయి. విశాఖ స్టేషన్ నుంచి ఇక్కడికి 11కి.మీ. దూరం కాగా, దువ్వాడ 23కి.మీ. దూరం ఉంటుంది. ఈ దృష్ట్యా నగరవాసులకు ఉత్తర సింహాచలం స్టేషన్ కొంత సౌకర్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. రాత్రుళ్లు స్టేషన్లోకి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. విశాఖ స్టేషన్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా 10 రైళ్లను ఇక్కడ నిలిపితే నగర ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని డీఆర్యూసీసీ(డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ) కోరుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలని కోరుతోంది. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ వాణిజ్య పరంగా ఈ స్టేషన్కు వెసులుబాటు లేని కారణంగా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అందుకే ప్రతిపాదన చేయలేదన్నారు. కార్యకలాపాల సౌలభ్యం కోసం కొన్ని రైళ్లకు హాల్ట్ కల్పిస్తున్నట్లు చెప్పారు.
చెట్ల కొమ్మలు పడి నిలిచిన పలు రైళ్లు
దువ్వాడ కాపు జగ్గరాజుపేట గేటు సమీపంలో రైల్వే విద్యుత్ తీగలపై పలుచోట్ల చెట్లు కొమ్మలు పడటంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం వీచిన భారీ గాలులకు దువ్వాడ-రాజమహేంద్రవరం ప్రధాన మార్గంతో పాటు దువ్వాడ స్టీల్ప్లాంట్లకు వెళ్లే రైలు మార్గంలో కొమ్మలు పడినట్లు గుర్తించిన సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో విశాఖ నుంచి బయలుదేరి వెళ్లాల్సిన విశాఖ-సికింద్రాబాద్ గరీబ్రథ్, భువనేశ్వర్-ఎస్ఎంవీటీ బెంగళూరు - హంసఫర్, విశాఖ- నాందేడ్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లు గోపాలపట్నం, మర్రిపాలెం స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. ముందుగా ప్రధాన మార్గంలో విద్యుత్ తీగలను సరి చేయడంతో ఒక్కొక్కటిగా బయలుదేరి వెళ్లాయి.
ఏయే రైళ్లు వెళుతున్నాయంటే..
* టాటా-ఈఆర్ఎస్ రైలు(ఆదివారం రాత్రి 8.45 గంటలకు)
* ఎస్బీపీ-సీబీఈ (ప్రత్యేక రైలు) (బుధవారం రాత్రి 8.45 )
* హావ్డా-ఎస్ఎస్పీఎన్ (గురువారం తెల్లవారుజామున 4.45)
* బీబీఎస్-తిరుపతి (శనివారం రాత్రి 7.37)
* తిరుపతి-బీబీఎస్ (సోమవారం ఉదయం 9.30గంటలకు)
* ఈఆర్ఎస్-టాటా (సోమవారం మధ్యాహ్నం 12.08)
* సీబీఈ-బీజేయూ (బుధవారం రాత్రి 10.40)
* ఈఆర్ఎస్-టాటా (గురువారం మధ్యాహ్నం 12.08)
* ఎస్ఎస్పీఎన్-హావ్డా(శుక్రవారం రాత్రి 11గంటలకు)
* సీబీఈ-ఎస్బీపీ (శనివారం మధ్యాహ్నం 12.08)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?