ముడిసరకే భారం.. మూసివేతే మార్గం
ఫెర్రో రంగాన్ని వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. 2022 జులై నుంచి విద్యుత్తు ఛార్జీల వల్లే నష్టం వస్తుందని లబోదిబోమంటున్నా విసుగుచెందిన పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఫెర్రో పరిశ్రమల యాజమాన్యాలు గగ్గోలు
అచ్యుతాపురం, న్యూస్టుడే
ఫెర్రో రంగాన్ని వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. 2022 జులై నుంచి విద్యుత్తు ఛార్జీల వల్లే నష్టం వస్తుందని లబోదిబోమంటున్నా విసుగుచెందిన పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒడిశాలో టాటా సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పార్కులో ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని సన్నాహాలు ఆరంభించాయి. ఇదే జరిగితే ఏపీలో 3.50 లక్షల మంది రోడ్డున పడే ప్రమాదం ఉంది.
అచ్యుతాపురం సెజ్లో అభిజీత్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీ, మైథాన్, ఆల్బస్, సుందరం పరిశ్రమలు విస్తరించాయి.
2002-12 వరకు కేవలం ఏడు పరిశ్రమలే ఉన్న ఏపీలో తెదేపా ప్రభుత్వ కృషి కారణంగా 2018 నాటికి రూ. 15 వేల కోట్లతో 38 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. విద్యుత్తే ముడిసరకుగా నడిచే ఫెర్రో పరిశ్రమలకు తెదేపా ప్రభుత్వం సింగిల్ టారిఫ్ కింద య´నిట్ ధర రూ. 4.95 అందించి ప్రోత్సహించింది. దీంతోపాటు పరిశ్రమలకు 2016-17కి రూ.1.50, 2017-18లో 0.75 పైసలు రాయితీ అందించి నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఈరంగాన్ని కాపాడింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా 50 వేల మంది అనుబంధ రంగాల ద్వారా 3 లక్షల మందికి ఉపాధిని అందించే ఫెర్రో పరిశ్రమను రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. రాయితీలు ఇవ్వకపోయినా, అంతర్జాతీయంగా నిర్మాణరంగం కుదేలుకావడం, స్టీల్కు డిమాండ్ తగ్గిపోవడంతో ధరలు భారీగా పతనమైనా మంచి రోజులు రాకపోతాయా? అని టన్ను రూ. 12 వేల వరకు నష్టం వచ్చినా ఇప్పటివరకు నెట్టుకొచ్చాయి.
ప్రపంచానికి ఎగుమతి అవుతున్న ఫెర్రో ఉత్పత్తుల్లో ఏపీ పరిశ్రమల వాటా 60 శాతం ఉండగా మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 40 శాతం చేస్తున్నాయి. ఈ పరిశ్రమపై వైకాపా ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల రూపంలో బాదింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఉన్న సింగిల్ టారిఫ్ను డబల్ టారిఫ్గా మార్చిన జగన్ సర్కార్ డ్యూటీ పేరుతో రూ. 0.6 పైసలు, రూ. 0.94 పైసలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరుతో రూ. 0.7 పైసలు ఐదేళ్లు వసూళ్లు చేశారు. వీటితో పాటు ఎనర్జీ కింద రూ.0.52పైసలు, రూ.0.40పైసలు ఫ్యూయల్ ఛార్జీలు ఇలా అన్ని రకాలైన బాదుడు కలిపి యూనిట్కి రూ. 3.89 విధించారు. ప్రభుత్వం విధించిన అదనపు బాదుడుకు కొనుగోలు ఛార్జీ రూ.4.95 కలిపి ఒక్కో యూనిట్ ధర మరెక్కడాలేని విధంగా ఏపీలో రూ.8.84 పడుతోంది.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో యూనిట్ ధర రూ. నాలుగున్నరే ఉంది. ఒడిశాలో యూనిట్ రూ.5.20 ధర ఉండగా కొత్తగా వచ్చే పరిశ్రమలకు రూ.1.50 రాయితీ అందిస్తామని పరిశ్రమలను ఆహ్వానిస్తోంది.
కొలిమి ఆపితే మళ్లీ 48 గంటలకే!
సెజ్లోని మిగిలిన పరిశ్రమలు అత్యవసర సమయంలో జనరేటర్లు ఉపయోగించి ఉత్పత్తులు కొనసాగించే అవకాశం ఉన్నా ఫెర్రో కంపెనీలు మాత్రం ఉత్పత్తిని కొనసాగించే అవకాశం లేదు. పరిశ్రమలో కొలిమి ఒక్కసారి నిలుపుదల చేస్తే మళ్లీ అది ప్రారంభం కావడానికి 48 గంటలకుపైగా సమయం పడుతోంది. భారీస్థాయిలో విద్యుత్తు వినియోగం ఈ కంపెనీల మూలంగా అవుతోంది. విద్యుత్తే వీటికి ముడిసరకు కావడంతో ప్రభుత్వాలు ఫెర్రో కంపెనీలకు రాయితీపై విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. తెదేపా ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వం ఏకంగా యూనిట్ ధరను రూ.4.25 నుంచి రూ.8.84 పెంచడం వల్ల ఈ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పరిశ్రమలు మూసివేయాలని నిర్ణయం వెనుక విద్యుత్తు ఛార్జీలే ప్రధాన కారణమని ఫెర్రో కంపెనీల యాజమానులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు