ప్రభుత్వ జాగా.. అక్రమార్కుల పాగా...
రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. నేటికీ ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టి సంరక్షించడంలో ఉన్నతాధికారులు చొరవ చూపటం లేదు.
సంరక్షణ మరచిన యంత్రాంగం
మారికవలసలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయని ప్రభుత్వ స్థలం
న్యూస్టుడే, కొమ్మాది : రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. నేటికీ ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టి సంరక్షించడంలో ఉన్నతాధికారులు చొరవ చూపటం లేదు. దీంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.
* అత్యంత విలువైన భూములను కొందరు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తుండడంతో.. రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలనే సూచనలూ అధికారులు పట్టించుకోవడం లేదు. రక్షణకు కంచె ఏర్పాటుకు నిధులు లేవనే కారణాలు చెబుతున్నారు.కనీసం ఇనుప హెచ్చరిక బోర్డులనైనా ఆక్రమిత స్థలాల్లో ఏర్పాటు చేస్తే కొంతైనా రక్షణ ఉంటుంది. గట్టిగా గాలివీస్తే ఎగిరిపోయే ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ఫలితం ఏముంటుందో వారికే తెలియాలి.
* మధురవాడ పైవంతెనకు కూతవేటు దూరంలో ఎంఎస్ఆర్ లే-అవుట్కు ఆనుకుని ఉన్న వాగు స్థలాన్ని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ కాలనీలో మురుగు నిలిచి జనం ఇబ్బందులు పడుతున్న స్థితిపై ‘ఈనాడు’లో కథనాలు ప్రచురించడంతో జీవీఎంసీ అధికారులు స్పందించారు. రూ.16లక్షలతో ఆ ప్రభుత్వ స్థలం మీదుగా కాలువ నిర్మాణం చేపట్టారు. మిగతా స్థలంలో ఫ్లెక్సీతో బోర్డు ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే ఆ బోర్డు మాయమైంది. విలువైన స్థలం అన్యాక్రాంతం కాకుండా రేవళ్లపాలెంలో అద్దె భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సచివాలయానికి ఈ స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందనే సూచనలు కూడా వస్తున్నాయి. - మారికవలస కూడలిలో జాతీయరహదారికి ఆనుకుని రూ.కోట్ల విలువైన 300 గజాల భూమిపై కొందరు కన్నేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు సిద్ధపడుతున్నా.. రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏర్పాటుకు హెచ్చరిక బోర్డులు లేవనే సమాధానం వస్తుందని పలువురు చెబుతున్నారు.
* గత ఏడాది జనవరిలో అప్పటి తహసీల్దార్ రామారావు కొన్ని ఇనుప హెచ్చరిక బోర్డులను తయారుచేయించి మధురవాడ, పీఎంపాలెం, పరదేశిపాలెం, మారికవలస, కొమ్మాది తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుచేయించారు. ఆ బోర్డుల్లో కొన్ని మాయమవగా... కొన్ని ఇప్పటికీ భూములకు రక్షణగా నిలిచాయి.
ఇటీవల హెచ్చరిక బోర్డు తొలగించిన ప్రాంతం
* రేవళ్లపాలెం రహదారిలో పీఎంపాలెం పోలీస్స్టేషన్ ఎదురుగా సర్వే సంఖ్య 196లోని ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డును కొందరు తొలగించేశారు. ఆక్రమించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నా... ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం. రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?