ఇంటి తేజం ఆరిపోయింది.. పుట్టెడు శోకం మిగిలింది!
ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మెడ చుట్టూ చేతులు వేసి నాన్నా.. అంటూ అల్లుకుపోయే కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు.
పల్లా తేజ (పాతచిత్రం)
పెందుర్తి, న్యూస్టుడే: ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మెడ చుట్టూ చేతులు వేసి నాన్నా.. అంటూ అల్లుకుపోయే కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఉదయం నుంచి చీర చెంగు పట్టుకుని తిరిగే చిన్ని కృష్ణుడి వంటి కన్న కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైన ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో అయిదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, బాలుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పల్లా కనకరాజు లారీ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య నారాయణమ్మ, డిగ్రీ చదువుతున్న కుమార్తె కృష్ణవేణి, కుమారుడు తేజ(5) ఉన్నారు. కనకరాజుకు కుమార్తె పుట్టిన చాలాఏళ్ల తర్వాత తేజ జన్మించడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్తూ సందడిగా ఉండేవాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తేజ రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అసిరితాత గ్రామానికి వచ్చి బాలుడి బంధువులతో కలిసి అర్ధరాత్రి వరకూ పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం తెల్లవారుజామున తేజ బంధువులు మరోసారి వెతుకులాట ప్రారంభించారు. ఇంటికి సమీపంలోనే లారీ షెడ్డు దరి చెట్టు కింద బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. వెస్ట్జోన్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, గోపాలపట్నం సీఐ ఇ.నరసింహారావు సంఘటన ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహమూర్తి మాట్లాడుతూ బాలుడి ఎడమ చేతిపై రెండు గాట్లు ఉండటంతో పాము కాటుకు గురయ్యాడా..? అన్న అనుమానాలు ఉన్నాయన్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలుడి మృతిపై స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వివరించారు. గ్రామంలో ఓ వివాదానికి సంబంధించి జరిగిన తగాదాకు వచ్చిన నగరంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన యువకులు తన కొడుకును ఏమైనా చేసి ఉండొచ్చని తేజ తల్లి నారాయణమ్మ అనుమానం వ్యక్తం చేశారు. బాలుడి మృతదేహం దొరికిన చోట గురువారం రాత్రి వెతికినా కనిపించలేదని, శుక్రవారం ఉదయానికి కనిపించడం అనుమానాలకు తావిస్తోందని వాపోయారు.
చేతిపై గాట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ