నగరానికొస్తాం..!
గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మూడేళ్ల క్రితం ఏర్పడిన గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 9,301 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
‘సచివాలయ’ ఉద్యోగుల పైరవీలు
ప్రారంభమైన బదిలీల కసరత్తు
వన్టౌన్, న్యూస్టుడే
గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మూడేళ్ల క్రితం ఏర్పడిన గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 9,301 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల వీరికి ప్రభుత్వం ప్రొబేషన్ ఇచ్చి వేతన స్థిరీకరణ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న బదిలీలు కావడంతో ఎక్కువ మంది గ్రామీణ/గిరిజన ప్రాంతాల నుంచి విశాఖ నగరానికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనికి తగ్గట్టుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకొని పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వశాఖల వారీ బదిలీలు జరగనుండడంతో ఆయా శాఖాధిపతులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. పనిలో పనిగా కొంత మంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికి 551 మంది దరఖాస్తు: ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన బదిలీలు జరగ నున్నాయి. విశాఖ జిల్లాలో 607, అనకాపల్లి జిల్లాలో 522, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 212 చొప్పున 1341 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటికి 10,314 పోస్టులు మంజూరు కాగా, వాటిలో 1,013 ఖాళీగా ఉన్నాయి. సచివాలయాల్లో 9,301 మంది పనిచేస్తున్నారు. వీరిలో విశాఖ జిల్లాలో 5,163, అనకాపల్లి జిల్లాలో 3,328, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 810 మంది సేవలందిస్తున్నారు. బదిలీల కోసం ఇంత వరకు 551 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. మరో 101 మంది ఇతర జిల్లాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేశారు. వాస్తవానికి ఈనెల 10లోపు ఈ ప్రక్రియ ముగించాల్సి ఉంది. అయితే దరఖాస్తుల వడబోత, ఇతరత్రా పనులు పూర్తి చేయడానికి గడువు సరిపోదని పలు జిల్లాల నుంచి వెళ్లిన వినతుల మేరకు ఈనెల 15 వరకు గడువు పొడిగించారు.
కేటగిరీల వారీగా పరిశీలన: ఏయే కేటగిరీల్లో బదిలీల దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాలను పరిశీలిస్తున్నారు. నాన్ లోకల్ కేటగిరీ కింద కేవలం 15శాతం లోపు మాత్రమే బదిలీలు చేయవల్సి ఉంది. ఆయా లెక్కలను యంత్రాంగం పరిశీలిస్తోంది. పోస్టులు ఖాళీలున్నప్పటికీ ప్రస్తుత బదిలీల ప్రక్రియలో వాటిని భర్తీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఖాళీల మేరకు ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులు రావాలి. అలా వచ్చినా నాన్ లోకల్ కింద 15శాతం లోపే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ