రైలు ఢీకొని డ్రైవర్ మృతి
మేహాద్రి రిజర్వాయర్ కింది కాలువలో జరుగుతున్న వినాయక నిమజ్జనాలను చూడడానికి వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా రైలు ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు
సంజీవి (పాతచిత్రం)
వేపగుంట, న్యూస్టుడే: మేహాద్రి రిజర్వాయర్ కింది కాలువలో జరుగుతున్న వినాయక నిమజ్జనాలను చూడడానికి వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా రైలు ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేహాద్రి రిజర్వాయర్కు దగ్గరలో నివాసముంటున్న సంజీవి(35) ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకం వాహనంలో డ్రైవర్గా పని చేస్తున్నారు. ఇతనికి భార్య లక్ష్మీప్రసన్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంజీవి బుధవారం రాత్రి వినాయక విగ్రహాల నిమజ్జనాలను చూసేందుకు రిజర్వాయర్ వైపు రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు. తిరిగి ఇంటికొచ్చే సమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా పెందుర్తి నుంచి విశాఖ వైపు వెళ్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రాత్రి 2 గంటల సమయంలో పోలీసుకు సమాచారం అందడంతో జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు ఆదేశాల మేరకు హెచ్సీ భాస్కరరాజు సంఘటనా స్థలికి వెళ్లి వివరాలను సేకరించారు. ట్రాక్పై ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి గురువారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుపాను పంజా కుంభవృష్టి... ముంచేసింది!!
[ 07-12-2023]
‘మిగ్జాం’ తుపాను బలహీనపడిన తర్వాత జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ప్రహరీలు కూలిపోయాయి. -
అంతటా.. వరద గాయాలే!!
[ 07-12-2023]
వేసవిలో అక్కడ ఒక్క చుక్క కూడా నీరు దొరకదు. వర్షాకాలంలో ఒక్క చుక్క వరద బయటకు పోదు. ఇదీ ప్రస్తుతం జగనన్న కాలనీల పరిస్థితి. మిగ్జాం తుపాను కారణంగా వరద నీటిలో జగనన్న కాలనీ పునాదులు మునిగి తేలుతున్నాయి. -
ఆగని వానలు.. ఉప్పొంగిన వాగులు
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటినా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందాల్సిన వేల ఎకరాల పంట ఈ తుపాను ధాటికి గంగపాలైంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రెండు జిల్లాల వాసులు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 07-12-2023]
జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. -
నేడు పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 07-12-2023]
ఎంవీపీకాలనీ ఆళ్వార్దాస్ మైదానంలో గురువారం జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వెల్లడించారు. -
తుపాను నష్టాలపై యంత్రాంగం ఆరా
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టాలపై యంత్రాంగం ఆరా తీస్తోంది. తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పంటలకు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలపై నివేదికలు అందజేయాలని మండల, డివిజన్ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. -
విరిగిపడిన కొండచరియలు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా, అనంతగిరి మార్గంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగి పడడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. -
23న సింహగిరిపై వైకుంఠ ఏకాదశి ఉత్సవం
[ 07-12-2023]
సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
బీసీగేటు దారి.. నిత్యం సవారీ..!
[ 07-12-2023]
నిత్యం రద్దీగా ఉండే గాజువాక- స్టీల్ప్లాంట్ బీసీగేటు ప్రధాన రహదారికి ఇరువైపులా అనధికార వాహనాల పార్కింగ్తో ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో నిత్యం విధులకు వెళ్లే ఉక్కు కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
హోంగార్డుల సేవలు అభినందనీయం
[ 07-12-2023]
హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. అనకాపల్లిలో బుధవారం హోంగార్డుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ 1962లో తొలిసారిగా అత్యవసర... -
తుపాను సన్నద్ధతలో ప్రభుత్వం విఫలం: అనిత
[ 07-12-2023]
తుపానుపై ప్రజలను రక్షించి, సన్నద్ధత చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నక్కపల్లిలో ముంపునకు గురైన కాలనీలోకి వెళ్లి ఆమె బాధితులను పరామర్శించి, మగ్గాలు పరిశీలించారు. -
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
[ 07-12-2023]
పంటలు నీట మునిగి పీకల్లోతు కష్టాల్లో రైతాంగం ఉంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే పరిస్థితికి తీసుకువెళ్లారని తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు మండిపడ్డారు. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం
[ 07-12-2023]
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రవి, ఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మంత్రికి రైతుల కష్టాలు కనిపించవా?
[ 07-12-2023]
తుపానుకు దెబ్బతిన్న చెరకు, వరి పంటలకు ఎకరాకు రూ. 30 వేలు పరిహారంగా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మంత్రి అమర్నాథ్కు రైతుల కష్టాలు కనిపించడం లేదన్నారు. -
రైతులను ఆదుకోవాలన్నా అప్పులు చేయాల్సిందే!
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం విలేకరులకు పంపిన వీడియో ప్రకటనలో ఆయన... -
పార్టీల సహకారంతో ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ
[ 07-12-2023]
రాజకీయ పార్టీల సహకారంతో ఓటర్లు జాబితా స్వచ్ఛీకరణ చేపడుతున్నామని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
యువగళం సభకు స్థల పరిశీలన
[ 07-12-2023]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఓ లేఅవుట్ను నేతలు బుధవారం పరిశీలించారు. -
8న అగ్నిప్రమాద బాధితులకు తెదేపా ఆర్థిక సాయం
[ 07-12-2023]
చేపలరేవులో అగ్నిప్రమాదానికి ఆహుతైన బోట్లకు చెందిన ఆపరేటర్లకు, ఉపాధి కోల్పోయిన 400 మంది మత్స్యకారులకు ఈనెల 8న తెదేపా తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
[ 07-12-2023]
తుపాను వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలుస్తామన్నారు.