4 వేల లీటర్ల పెట్రోల్ నేలపాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ) టెర్మినల్ విశాఖ ఫిల్లింగ్ ప్లాంట్లో గురువారం మోటారు స్పిరిట్(ఎంఎస్-పెట్రోల్) పైపు పగిలి 4 వేల లీటర్ల వరకు వృథా అయింది
ఐఓసీ టెర్మినల్లో పగిలిన ఫిల్లింగ్ పైప్
సింధియా, న్యూస్టుడే : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ) టెర్మినల్ విశాఖ ఫిల్లింగ్ ప్లాంట్లో గురువారం మోటారు స్పిరిట్(ఎంఎస్-పెట్రోల్) పైపు పగిలి 4 వేల లీటర్ల వరకు వృథా అయింది. ఆ వివరాలు... ఉదయం 10.30 గంటల సమయంలో టెర్మినల్లో లోడింగ్ కోసం ఆయిల్ ట్యాంకర్ ర్యాంపులోకి వెళ్లింది. ట్యాంకర్లో 4 కేఎల్ ఛాంబర్ నిండిన తర్వాత వాల్వు కట్టాలి. అలా వాల్వు కట్టేలోపు ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో ట్యాంకర్లోకి మోటారు స్పిరిట్ సరఫరా చేస్తున్న పైపు ఒక్కసారిగా పగిలి, పెట్రోల్ ఎగజిమ్మింది. దీంతో ఆ ఇంధనం పక్కనే ఉన్న మరో ట్యాంకర్ డ్రైవర్ ఆరీఫ్(50)పై పడడంతో తడిసి ముద్దయ్యాడు. అధికారులు మెయిన్ ట్యాంకు వద్ద ఎంఎస్ బ్లాక్ వాల్వు మూసేసి, ఆరీఫ్కు అక్కడే స్నానం చేయించారు. ఇంతలో అతడి శరీరమంతా ఎర్రటి దద్దుర్లు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు లోడింగ్ నిలిపేసి, ఆ తర్వాత పునఃప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన ‘మిగ్జాం’
[ 06-12-2023]
‘మిగ్జాం’ తీవ్ర తుపాను ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో గెడ్డలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. -
కోలుకోలేని దెబ్బ
[ 06-12-2023]
మిగ్జాం తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో తీవ్ర కరవు ఏర్పడింది. అయినా రైతులు అతికష్టం మీద పంటలు వేశారు. -
వైకాపా నాయకుల... భూదాహం
[ 06-12-2023]
అధికార వైకాపా నేతలు కొందరు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తెగించారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల పరిధిలో ఏకంగా ప్రభుత్వ భూమిని చదును చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. -
సహాయక కేంద్రాలకు తరలించాలి
[ 06-12-2023]
తుపాను సమయంలో ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. -
ఖాతాదారుల సేవా కేంద్రంలో చోరీ
[ 06-12-2023]
నాగయ్యపేట శివారు సీతంపేటలోని ఏపీజీవీబీ ఖాతాదారుల సేవా కేంద్రంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి రూ.3.5 లక్షల నగదు ఎత్తుకుపోయారు. -
పలు రైళ్ల దారి మళ్లింపు
[ 06-12-2023]
దక్షిణ మధ్య రైల్వే కాజీపేట-కొండపల్లి సెక్షన్ వరంగల్ స్టేషన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
లోతట్టు ప్రాంతాలు జలమయం
[ 06-12-2023]
తీరం దాటిన తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేని వర్షం కురిసింది. -
బోట్ల వెలికితీతకు సన్నాహాలు
[ 06-12-2023]
చేపలరేవు జీరో జెట్టీలో మునిగిన బోట్లను వెలికి తీసేందుకు మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విశాఖ పోర్టు అథారిటీ(వీపీఎ) అధికారులకు లేఖ రాసింది. -
డ్వాక్రా సొమ్ము పక్కదారి
[ 06-12-2023]
డ్వాక్రా మహిళల ఖాతాలకు వెళ్లాల్సిన పొదుపు సొమ్ము కొంత మంది సిబ్బంది తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా.. -
ఇప్పటికైనా కళ్లు తెరవండి జగన్: గంటా
[ 06-12-2023]
‘అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్మోహన్రెడ్డి గారు..’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ట్విటర్ ద్వారా స్పందించారు. -
మహాసభలకు భారీగా తరలింపు
[ 06-12-2023]
విజయవాడలో జరనున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర మహాసభలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివెళ్లాలని సంఘం నేతలు నిర్ణయించారు. -
‘భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం’
[ 06-12-2023]
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం లోపభూయిష్టంగా ఉందని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు అన్నారు. -
వైద్యారోగ్యశాఖలో అక్రమ నియామకాలపై విచారణ
[ 06-12-2023]
వైద్యారోగ్యశాఖలో ఇదివరకు చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని, అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగింది. -
యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
[ 06-12-2023]
యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కర్ని ఓటరుగా చేర్చాలన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం: రాహుల్ గాంధీ
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Heart Attack: గుండెపోటు కలవరం వేళ.. 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్
-
OnePlus 12: స్నాప్డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్తో వన్ప్లస్ 12.. ఇండియాలో ఎప్పుడంటే?
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కేసీఆర్, చంద్రబాబు సహా ముఖ్యనేతలకు ఆహ్వానాలు
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్.. వారిద్దరి మధ్య డైరెక్ట్ షూటౌట్: భారత మాజీ క్రికెటర్