చంద్రబాబు అక్రమ అరెస్టు.. జగన్ పతనానికి నాంది
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసి వైకాపా నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఆందోళన కార్యక్రమాల్లో తెదేపా నేతలు
59వ వార్డు పిలకవానిపాలెంకూడలిలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే గణబాబు, పార్టీ శ్రేణులు
కార్పొరేషన్, న్యూస్టుడే: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసి వైకాపా నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్కిల్ స్కాం అంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించారని, పాలకుల మెప్పుకోసం కొంత మంది అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపిన జగన్కు పతనం ప్రారంభమైందన్నారు. రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు మాట్లాడారు. అనంతరం వైకాపా ప్రభుత్వం రాష్ట్రం నుంచి పోవాలని నినాదాలు చేస్తూ తెదేపా కార్యకర్తలు గాంధీ విగ్రహం పరిసరాలను చీపుళ్లతో శుభ్రం చేశారు.
అరెస్టులతో అడ్డుకోలేరు..
కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్నతెదేపా నేతలు అనిత, పల్లా, రాజబాబు, తదితరులు
వన్టౌన్, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం రాత్రి తెదేపా కార్యాలయం వద్ద నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్కు పరిపాలన చేత కాక, ప్రశ్నించే ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారన్నారు. అందులో చంద్రబాబు అరెస్టు ఒకటన్నారు. పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, దక్షిణం, భీమిలి నియోజకవర్గాల బాధ్యులు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, తెలుగు మహిళా విభాగ ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్రజలే జగన్కు తగిన బుద్ధి చెబుతారని, నిర్బంధాలు, అక్రమ కేసులతో తెదేపాను అడ్డుకోలేరన్నారు.
‘తూర్పు’లో ర్యాలీకిఆటంకాలు... ఉద్రిక్తత
ర్యాలీలో ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు
ఆరిలోవ, విశాలాక్షినగర్, న్యూస్టుడే: చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా ‘బాబు కోసం మేము సైతం’ అంటూ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శనివారం రాత్రి 10వ వార్డు పరిధి వివేకానందనగర్ నుంచి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తోటగరువు కూడలి వద్దకు వచ్చేసరికి పోలీసులు అడ్డుకున్నారు. ‘నిరసన తెలపటం మా ప్రాథమిక హక్కు’ అని నినాదాలు చేస్తూ నేతలు ముందుకు వెళుతుండగా అదనపు పోలీసు బలగాలను రప్పించి కదలనీయలేదు. సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నందున ర్యాలీ జరపకూడదని పోలీసులు అడ్డగించడంతో తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుని గట్టిగా నినాదాలు చేశారు. కార్యకర్తలను పోలీసులు జీపు ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిఘటించారు. ఈ సందర్భంలో తొపులాట జరిగింది. ఈ తోపులాటలో 13వ వార్డుకు చెందిన ఎస్.లక్ష్మీ అనే కార్యకర్త కిందపడిపోవడంతో దెబ్బలు తగిలాయి.
ర్యాలీ పాల్గొన్న తెదేపా శ్రేణులు
గంగవరం దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యేపల్లా శ్రీనివాసరావు, నాయకులు
రైల్వేన్యూకాలనీలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలుపుతున్న గండి బాబ్జీ, తెదేపా నాయకులు
తోటగరువు వద్ద ర్యాలీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
అక్కయ్యపాలెంలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరు జాబితాలో మీ పేరు ఉందా ..!
[ 02-12-2023]
ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియలో కీలకంగా భావిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈనెల 2,3 తేదీల్లో పోలింగ్ కేంద్రం స్థాయిలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. -
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
[ 02-12-2023]
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాణిపేట తాడివీధిలో నివాసముంటున్న విద్యార్థి(16) ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు -
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
[ 02-12-2023]
చదువులో రాణించలేకపోతున్నానని.. మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గాజువాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
క్రికెటర్లకు ఘన స్వాగతం
[ 02-12-2023]
శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలోని క్రికెట్ స్టేడియంలో జరిగే లెజెండ్స్ టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు కొందరు క్రీడాకారులు శుక్రవారం విశాఖ చేరుకున్నారు -
కేజీహెచ్కు నకిలీ నియామకపత్రాల బెడద
[ 02-12-2023]
కేజీహెచ్కు నకిలీ నియామక పత్రాల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం నకిలీ నియామకపత్రాలతో ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన ఇద్దరిని ఆసుపత్రి వర్గాలు పట్టుకొని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు -
మత్స్యశాఖ జేడీగా లాల్ అహ్మద్
[ 02-12-2023]
జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు (జేడీ)గా ఎస్కే లాల్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు. 11 మంది జేడీలకు పోస్టింగ్లు కేటాయిస్తూ మత్స్యశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మాణ రంగంతో అభివృద్ధి దిశగా అడుగులు
[ 02-12-2023]
విశాఖలో నిర్మాణ రంగంతోనే వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతోందని వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. -
కేసుల సమాచారానికి వెబ్ పోర్టల్
[ 02-12-2023]
పీవోఏ చట్టం, నిబంధనల అమలును ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ (ఏపీ సీఎఫ్ ఎస్ఎస్) అందుబాటులో ఉందని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి టి.అజయ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కన్నూరుపాలెం విద్యార్థులు
[ 02-12-2023]
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కన్నూరుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఎ.రాజేష్, పి.జ్యోత్స్న అండర్- 17 విభాగంలో తమ సత్తాచాటారు. -
తుపాను ప్రభావంతో భారీ వర్ష సూచన
[ 02-12-2023]
తుపాను ప్రభావంతో ఈనెల 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురస్తాయని డీఆర్వో బి.దయానిధి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంటలకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు -
బోగీల్లో సీట్లు కోయొద్దు: డీఆర్ఎం
[ 02-12-2023]
కొందరు ప్రయాణికులు రైళ్ల బోగీల్లో కర్టెన్లు, సీట్లను కోయడంతోపాటు కిటికీల అద్దాలను పగులగొట్టడం మరుగుదొడ్లను పాడు చేయడం తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాల్తేరు రైల్వే డీఆర్ఎం సౌరభ్ప్రసాద్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. -
మేల్కొంటే ఓటు..లేకుంటే చేటు
[ 02-12-2023]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఓటుతో మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకుంటాం. అంతటి కీలకమైన ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చూపితే చివరికి చేటే కలుగుతుంది. -
78మంది పోలీసుల బదిలీ
[ 02-12-2023]
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బదిలీలకు అర్హులైన 78 మంది పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేసే ప్రక్రియను ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం చేపట్టారు -
లాడ్జిలో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
[ 02-12-2023]
పాయకరావుపేటలోని లాడ్జిలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన రమణ అప్పుడప్పుడు పాయకరావుపేట వచ్చి గణేష్ భవన్ హోటల్లో బస చేసేవారు.


తాజా వార్తలు (Latest News)
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల
-
KRMB: సాగర్ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం
-
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్