ఇదేం తొండాట..!
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హెటెరో డ్రగ్స్ కంపెనీ కాలుష్యం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని, వ్యాధుల బారిన పడుతున్నామని మత్స్యకారులు రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు.
తొండంగి సెజ్లో వద్దన్నారని నక్కపల్లికి తరలింపు!
బల్క్డ్రగ్ పార్క్పై మత్స్యకారుల్లో ఆందోళన
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, నక్కపల్లి
నక్కపల్లి మండలంలో రైతుల నుంచి సేకరించిన భూములు
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హెటెరో డ్రగ్స్ కంపెనీ కాలుష్యం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని, వ్యాధుల బారిన పడుతున్నామని మత్స్యకారులు రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్లు నక్కపల్లి మండలంలో మరో బల్క్డ్రగ్ పార్క్ను భారీఎత్తున ఏర్పాటు చేసేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. స్థానికులకు ఉపాధి కల్పించడానికో.. ఇక్కడి వారిపై ప్రేమతోనో పెడుతున్నారా అనుకుంటే పొరపాటే. కాకినాడ జిల్లా తొండంగి సెజ్లో ఏర్పాటు చేయాల్సిన ఈ బల్క్డ్రగ్ పార్క్ను అక్కడివారు తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూముల్లోనే ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉండడంతోనే ప్రాంతాన్ని మార్చాల్సి వచ్చిందని సర్కారు పైకి చెబుతోంది. వాస్తవానికి తొండంగిలో అడ్డుకుంటున్నారనే ఇక్కడికి తరలిస్తున్నట్లు సమాచారం.
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏవీ నగరం, కోదాడ మధ్యలో 2 వేల ఎకరాలు బల్క్డ్రగ్ పార్క్ కోసం రెండేళ్ల క్రితమే కేటాయించారు. తొండంగి సెజ్ పేరుతో సేకరించిన భూముల్లో ఈ ఏడాది జూన్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో ప్రధానంగా బల్క్డ్రగ్ ఏర్పాటుపైనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాలుష్యకారక పరిశ్రమలు వద్దంటూ నినాదాలు చేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), కాలుష్య నియంత్రణ మండలికి అక్కడి వాళ్లు ఫిర్యాదు చేశారు. దీంతో 2,190 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ పార్క్ను నక్కపల్లి పారిశ్రామికవాడకు తరలించాలనే నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే అక్కడ ప్రజలు వద్దనుకున్న పరిశ్రమను ఇక్కడకు తరలించాలని నిర్ణయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా హెటెరో డ్రగ్స్ కాలుష్యంపై చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం ఇచ్చిన కానుకా ఇది అంటూ ప్రశ్నిస్తున్నారు. నక్కపల్లిలోని బల్క్డ్రగ్స్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడా వ్యతిరేకమే..
విశాఖ, చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా నక్కపల్లి నోడ్ ఏర్పాటు చేశారు. 4,300 ఎకరాలకు పైగా భూములను ఇదివరకే సేకరించారు. ఇందులో 2,250 ఎకరాల వరకు జిరాయితీ, మిగతావి ప్రభుత్వ, డిపట్టా, ఆక్రమిత భూములున్నాయి. వీటిలో పరిశ్రమల ఏర్పాటు కోసం మూడేళ్ల క్రితం ప్రజాభిప్రాయసేకరణ చేపట్టారు. అప్పట్లోనే రసాయన, కాలుష్యకారక పరిశ్రమలు వద్దని స్థానికులు ఆందోళన చేశారు. మిగతా కంపెనీలు ఏవి పెట్టినా అభ్యంతరం లేదని, ఫార్మా పరిశ్రమలు నెలకొల్పొద్దని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిపి మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కాదు కదా అవి ఏర్పాటు చేయడానికి కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదు. హెటెరో కంపెనీ వ్యర్థ జలాలు సముద్రంలోకి విడిచిపెట్టడానికి వేసిన పైపులైన్తో మత్స్య సంపద తరిగిపోయి వలసలు పోయే పరిస్థితి వచ్చిందని చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులంతా 600 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఎన్జీటీలో కేసు కూడా నడుస్తోంది. ఇంతలా వ్యతిరేకిస్తున్నా సర్కారు మాత్రం హెటెరో కంటే భారీ స్థాయిలో బల్క్డ్రగ్స్ పార్క్ను తెచ్చి వీరి నెత్తిన పెడుతుండడం విశేషం.
ప్రజాపోరాటం తప్పదు..
పరిశ్రమల కోసం రైతులు ఎంతో విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక్కడ కంపెనీలు ఏర్పాటుకు, అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. అలాగని కాలుష్య ముప్పును తెచ్చే బల్క్డ్రగ్స్ లాంటి పరిశ్రమలు పెడితే ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించం. ఇప్పటికే ఉన్న రసాయన పరిశ్రమలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడలో ప్రజలు వ్యతిరేకించి, ఎన్జీటీకి ఫిర్యాదు చేయడంతోనే బల్్్కడ్రగ్ పార్క్ని నక్కపల్లికి తీసుకొస్తున్నారు. ఇక్కడ మత్స్యకారులు కూడా ఇలాంటి పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నారు. కాదని బలవంతంగా ఏర్పాటు చేయాలని చూస్తే ప్రజా పోరాటం తప్పదు.
ఎం.అప్పలరాజు, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు
పైపులైన్కు వ్యతిరేకంగా మత్స్యకారులు, ప్రజా సంఘాల నాయకుల ఆందోళన (పాత చిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరు జాబితాలో మీ పేరు ఉందా ..!
[ 02-12-2023]
ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియలో కీలకంగా భావిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈనెల 2,3 తేదీల్లో పోలింగ్ కేంద్రం స్థాయిలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. -
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
[ 02-12-2023]
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాణిపేట తాడివీధిలో నివాసముంటున్న విద్యార్థి(16) ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు -
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
[ 02-12-2023]
చదువులో రాణించలేకపోతున్నానని.. మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గాజువాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
క్రికెటర్లకు ఘన స్వాగతం
[ 02-12-2023]
శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలోని క్రికెట్ స్టేడియంలో జరిగే లెజెండ్స్ టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు కొందరు క్రీడాకారులు శుక్రవారం విశాఖ చేరుకున్నారు -
కేజీహెచ్కు నకిలీ నియామకపత్రాల బెడద
[ 02-12-2023]
కేజీహెచ్కు నకిలీ నియామక పత్రాల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం నకిలీ నియామకపత్రాలతో ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన ఇద్దరిని ఆసుపత్రి వర్గాలు పట్టుకొని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు -
మత్స్యశాఖ జేడీగా లాల్ అహ్మద్
[ 02-12-2023]
జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు (జేడీ)గా ఎస్కే లాల్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు. 11 మంది జేడీలకు పోస్టింగ్లు కేటాయిస్తూ మత్స్యశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మాణ రంగంతో అభివృద్ధి దిశగా అడుగులు
[ 02-12-2023]
విశాఖలో నిర్మాణ రంగంతోనే వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతోందని వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. -
కేసుల సమాచారానికి వెబ్ పోర్టల్
[ 02-12-2023]
పీవోఏ చట్టం, నిబంధనల అమలును ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ (ఏపీ సీఎఫ్ ఎస్ఎస్) అందుబాటులో ఉందని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి టి.అజయ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కన్నూరుపాలెం విద్యార్థులు
[ 02-12-2023]
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కన్నూరుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఎ.రాజేష్, పి.జ్యోత్స్న అండర్- 17 విభాగంలో తమ సత్తాచాటారు. -
తుపాను ప్రభావంతో భారీ వర్ష సూచన
[ 02-12-2023]
తుపాను ప్రభావంతో ఈనెల 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురస్తాయని డీఆర్వో బి.దయానిధి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంటలకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు -
బోగీల్లో సీట్లు కోయొద్దు: డీఆర్ఎం
[ 02-12-2023]
కొందరు ప్రయాణికులు రైళ్ల బోగీల్లో కర్టెన్లు, సీట్లను కోయడంతోపాటు కిటికీల అద్దాలను పగులగొట్టడం మరుగుదొడ్లను పాడు చేయడం తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాల్తేరు రైల్వే డీఆర్ఎం సౌరభ్ప్రసాద్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. -
మేల్కొంటే ఓటు..లేకుంటే చేటు
[ 02-12-2023]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఓటుతో మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకుంటాం. అంతటి కీలకమైన ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చూపితే చివరికి చేటే కలుగుతుంది. -
78మంది పోలీసుల బదిలీ
[ 02-12-2023]
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బదిలీలకు అర్హులైన 78 మంది పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేసే ప్రక్రియను ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం చేపట్టారు -
లాడ్జిలో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
[ 02-12-2023]
పాయకరావుపేటలోని లాడ్జిలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన రమణ అప్పుడప్పుడు పాయకరావుపేట వచ్చి గణేష్ భవన్ హోటల్లో బస చేసేవారు.


తాజా వార్తలు (Latest News)
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా