తెదేపా బలగం x పోలీసుల బలం!!
దాదాపు 22 గంటల పాటు ఇదే పరిస్థితి. తమ అభిమాన నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటిలోకి వెళ్లకుండా పోలీసులను కట్టడి చేశారు.
వెన్నెలపాలెంలో ఉత్కంఠ.. ఉద్రిక్తత!!
మాజీ మంత్రి బండారు22 గంటల పాటు నిర్బంధం
తీవ్ర ప్రతిఘటనల మధ్య అరెస్టు చేసి తీసుకువెళ్లిన పోలీసులు
బండారుతో తెదేపా ముఖ్య నేతలు
ఈనాడు, విశాఖపట్నం, పరవాడ, న్యూస్టుడే: వందల మంది పోలీసులు ఓవైపు. వేల మంది తెదేపా శ్రేణులు మరో వైపు. ఎవరు అడుగు కదిపినా కలకలం రేగింది.
అంబులెన్స్ను ఆపిన పోలీసులతో తెదేపా నేతల వాగ్వాదం
ఒకటి కాదు..రెండు కాదు... దాదాపు 22 గంటల పాటు ఇదే పరిస్థితి. తమ అభిమాన నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటిలోకి వెళ్లకుండా పోలీసులను కట్టడి చేశారు. దీంతో బలగాల సంఖ్యను పెంచి తెదేపా కార్యకర్తలు, నేతలను పక్కకు లాగేశారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. గంట గంటకూ మారిన పరిణామాలతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద తీవ్ర ఉత్కంఠ...ఉద్రిక్తత నెలకొన్నాయి.
పలు నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి బండారును పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. బండారుకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, పార్టీ విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, పీలా గోవింద సత్యనారాయణ, తదితరులు వచ్చారు.
బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి పోలీసులు వెళ్లకుండా అడ్డుగా కూర్చున్న తెదేపా శ్రేణులు
ఆదివారం రాత్రి 10.20:
- వెన్నెలపాలెంలో బండారు ఇంటి వద్దకు పరవాడ సీఐ ఈశ్వరరావుతో పాటు మరో పది మంది చేరుకొని తలుపులు కొట్టి కిటికీలు తెరిచారు.
- 11.15 : ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన విషయం తెలిసి అభిమానులు రాక ప్రారంభమయింది.
- 11.30 : డీఎస్పీ కేవీ సత్యనారాయణ వెన్నెలపాలెం వచ్చి కారులో నుంచే పరిస్థితిని గమనించి సీఐ నుంచి వివరాలు తెలుసుకున్నారు.
- 12.55 : అర్ధరాత్రి సమయంలో ఎందుకొచ్చారని పోలీసులను తెదేపా నాయకులు ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చామని చెప్పారు..
- 1.30 : అనకాపల్లి జిల్లాలోని మిగిలిన స్టేషన్ల నుంచి పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదే సమయంలో బండారు ఇంటి చుట్టూ వలయంగా ఏర్పడ్డారు.
- 2.00 : ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి బండారు ఇంటి వైపు ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు.
పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినదిస్తున్న మహిళలు
సోమవారం ఉదయం 5.00:
- స్థానిక నాయకులు, న్యాయవాదులు ఎందుకొచ్చారంటూ డీఎస్పీని ప్రశ్నించగా.. గుంటూరులో కేసులు నమోదవ్వడంతో అరెస్టు చేసేందుకు వచ్చామని చెప్పారు.
- 7.50 : బండారును అరెస్టు చేస్తారనే సమాచారంతో అధిక సంఖ్యలో మహిళలు, నాయకులు ఇంటి గేటుకు అడ్డంగా బైఠాయించారు.
- 8.00 : కేసు విషయమై బండారును కలిసేందుకు డీఎస్పీ సత్యనారాయణ సీఐతో కలిసి ఇంటి లోపలికి వెళ్లారు.
- 9.00 : జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, తెదేపా నేత గండి రవి బండారు ఇంటి వద్దకు వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో వాగ్వాదాలతో తోపులాట జరిగింది.
- 9.10 : పార్టీ పిలుపు మేరకు గాంధీ చిత్ర పటంతో బండారు ఇంటిలోనే దీక్షలో కూర్చున్నారు. మీడియా లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
- అనకాపల్లిలో నిరసన..: బండారును అరెస్టు చేసి వైద్యపరీక్షల నిమిత్తం అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకువస్తున్నారని తెలిసిన తెదేపా నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు అక్కడికి తీసుకురాకుండా జాతీయ రహదారిపై తీసుకవెళ్లిపోయారు. దీంతో నేతలు నిరసన తెలిపారు.
మహిళను నిలువరిస్తున్న పోలీసులు
సోమవారం మధ్యాహ్నం 2.10:
- బండారుకు నీరసంగా ఉండడంతో వైద్యున్ని పిలిపించగా మధుమేహం 220, రక్తపోటు కొంత ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.
- 4.00 : అంబులెన్స్ను రప్పించగా.. అనుమతించకపోవడంతో పోలీసులకు, తెదేపా నేతలకు వాగ్వాదం జరిగింది.
- 4.15 : బండారుకు నోటీసులు ఇచ్చేందుకు గుంటూరు నుంచి పోలీసులు వచ్చారు.
- 4.30 : అభిమానుల ప్రతిఘటనలను పోలీసులు తప్పించుకొని నోటీసులు ఇవ్వడానికి లోపలికి వెళ్లారు.
- 5.00 : బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు దిల్లీ నుంచి ఇంటికి చేరుకున్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
సోమవారం రాత్రి..
- 6.00 : నోటీసులు ఇచ్చేందుకు గుమ్మం వద్ద పోలీసులు నిరీక్షించారు.
- 7.30 : అధిక సంఖ్యలో పోలీసులు చేరుకోగా.. కొందరు గోడలు దూకి ఇంటి ప్రాంగణంలోకి చేరుకొని తలుపులు కొట్టారు
- 7.35 : తలుపులు తీయడంతో అయిదుగురు పోలీసులు లోపలికి వెళ్లి నోటీసులు అందజేశారు.
- 7.55 : బండారును ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చిన పోలీసులు గుంటూరుకు తరలించారు.
బండారును గుంటూరు పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లగా... ఇతర వాహనాల్లో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, బండారు కుమారుడు అప్పలనాయుడు, తదితరులు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుపాను పంజా కుంభవృష్టి... ముంచేసింది!!
[ 07-12-2023]
‘మిగ్జాం’ తుపాను బలహీనపడిన తర్వాత జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ప్రహరీలు కూలిపోయాయి. -
అంతటా.. వరద గాయాలే!!
[ 07-12-2023]
వేసవిలో అక్కడ ఒక్క చుక్క కూడా నీరు దొరకదు. వర్షాకాలంలో ఒక్క చుక్క వరద బయటకు పోదు. ఇదీ ప్రస్తుతం జగనన్న కాలనీల పరిస్థితి. మిగ్జాం తుపాను కారణంగా వరద నీటిలో జగనన్న కాలనీ పునాదులు మునిగి తేలుతున్నాయి. -
ఆగని వానలు.. ఉప్పొంగిన వాగులు
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటినా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందాల్సిన వేల ఎకరాల పంట ఈ తుపాను ధాటికి గంగపాలైంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రెండు జిల్లాల వాసులు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 07-12-2023]
జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. -
పురుగుల అన్నం మాకొద్దు..
[ 07-12-2023]
పోలమాంబ గుడి వద్ద ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన ఇంజినీరింగ్ వసతి గృహం ‘మేటా’లో విద్యార్థులు బుధవారం రాత్రి భోజనం చేయకుండా నిరసన తెలిపారు. భోజనంలో పురుగులు కనిపించాయని.. ఆ భోజనం చేయలేమన్నారు. -
నేడు పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 07-12-2023]
ఎంవీపీకాలనీ ఆళ్వార్దాస్ మైదానంలో గురువారం జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వెల్లడించారు. -
తుపాను నష్టాలపై యంత్రాంగం ఆరా
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టాలపై యంత్రాంగం ఆరా తీస్తోంది. తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పంటలకు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలపై నివేదికలు అందజేయాలని మండల, డివిజన్ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. -
విరిగిపడిన కొండచరియలు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా, అనంతగిరి మార్గంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగి పడడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. -
23న సింహగిరిపై వైకుంఠ ఏకాదశి ఉత్సవం
[ 07-12-2023]
సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
బీసీగేటు దారి.. నిత్యం సవారీ..!
[ 07-12-2023]
నిత్యం రద్దీగా ఉండే గాజువాక- స్టీల్ప్లాంట్ బీసీగేటు ప్రధాన రహదారికి ఇరువైపులా అనధికార వాహనాల పార్కింగ్తో ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో నిత్యం విధులకు వెళ్లే ఉక్కు కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
హోంగార్డుల సేవలు అభినందనీయం
[ 07-12-2023]
హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. అనకాపల్లిలో బుధవారం హోంగార్డుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ 1962లో తొలిసారిగా అత్యవసర... -
తుపాను సన్నద్ధతలో ప్రభుత్వం విఫలం: అనిత
[ 07-12-2023]
తుపానుపై ప్రజలను రక్షించి, సన్నద్ధత చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నక్కపల్లిలో ముంపునకు గురైన కాలనీలోకి వెళ్లి ఆమె బాధితులను పరామర్శించి, మగ్గాలు పరిశీలించారు. -
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
[ 07-12-2023]
పంటలు నీట మునిగి పీకల్లోతు కష్టాల్లో రైతాంగం ఉంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే పరిస్థితికి తీసుకువెళ్లారని తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు మండిపడ్డారు. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం
[ 07-12-2023]
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రవి, ఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మంత్రికి రైతుల కష్టాలు కనిపించవా?
[ 07-12-2023]
తుపానుకు దెబ్బతిన్న చెరకు, వరి పంటలకు ఎకరాకు రూ. 30 వేలు పరిహారంగా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మంత్రి అమర్నాథ్కు రైతుల కష్టాలు కనిపించడం లేదన్నారు. -
రైతులను ఆదుకోవాలన్నా అప్పులు చేయాల్సిందే!
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం విలేకరులకు పంపిన వీడియో ప్రకటనలో ఆయన... -
పార్టీల సహకారంతో ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ
[ 07-12-2023]
రాజకీయ పార్టీల సహకారంతో ఓటర్లు జాబితా స్వచ్ఛీకరణ చేపడుతున్నామని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
యువగళం సభకు స్థల పరిశీలన
[ 07-12-2023]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఓ లేఅవుట్ను నేతలు బుధవారం పరిశీలించారు. -
8న అగ్నిప్రమాద బాధితులకు తెదేపా ఆర్థిక సాయం
[ 07-12-2023]
చేపలరేవులో అగ్నిప్రమాదానికి ఆహుతైన బోట్లకు చెందిన ఆపరేటర్లకు, ఉపాధి కోల్పోయిన 400 మంది మత్స్యకారులకు ఈనెల 8న తెదేపా తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
[ 07-12-2023]
తుపాను వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలుస్తామన్నారు.