కడలి ఒడిలో అగ్నిజ్వాల
చేపలరేవు కన్నీటి సంద్రంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కళ్ల ముందే జీవనాధారమైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు.
శోక సంద్రంగా మారిన చేపలరేవు
ఘటనలో మొత్తం 45 బోట్లు దగ్ధం
బాధితులు కన్నీరుమున్నీరు
వన్టౌన్, న్యూస్టుడే: చేపలరేవు కన్నీటి సంద్రంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కళ్ల ముందే జీవనాధారమైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. గతంలో పలు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నా రెండు లేదా మూడు బోట్లు మాత్రమే కాలిపోయేవి. ఈ సారి ఏకంగా 45 బోట్లు ఆగ్నికి ఆహుతవడంతో బోట్ల యజమానులు, వాటిపై ఆధారపడ్డ మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 36 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో 9 పాక్షికంగా కాలిపోయాయి. ఇక తాము ఎలా బతకాలని పరామర్శకు వచ్చిన నాయకుల వద్ద బాధితులు విలపించారు. అగ్నిప్రమాద ఘటనకు దారితీసిన కారణాలను ఇంత వరకు పోలీసులు వెల్లడించలేదు. మత్స్య ఉత్పత్తుల క్రయ, విక్రయాలతో నిత్యం సందడిగా ఉండే చేపలరేవులో సోమవారం ఎటుచూసినా విషాద వాతావరణం కనిపించింది. 45 బోట్లపై 360 మంది మత్స్యకారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వచ్చిన ఎంతో మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వీరు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది.
కారణాలపై విభిన్న వాదనలు
జీరో జెట్టీలో లంగరు వేసి ఉన్న బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని, అందులోనే తొలుత మంటలు రేగాయని విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మీడియాకు తెలిపారు. తొలుత మంటలు రేగిన బోటు (ఎంఎన్-12)లో ఆదివారం రాత్రి మందు పార్టీ జరిగిందని, ఆ సమయంలో భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్కు సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి బోటుకు నిప్పు అంటించారనే వాదన కూడా వినిపిస్తోంది. మరో వైపు...బోటు విక్రయానికి సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నాయని, దీనిపై ఆదివారం రాత్రి వాగ్వాదం పెరగడం మరో కారణంగా భావిస్తున్నారు. మద్యం, గంజాయి తాగిన తర్వాత కాల్చిన సిగరెట్ను బోటులో పడేయడంతో అది నైలాన్ వలలపై పడి మంటలు ఎగిశాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు కాలిపోయాయి.
గంజాయి, దందాలకు అడ్డాగా
అక్కడితో ఆగింది... లేదంటే.. మరో కాళరాత్రే!!
ఈనాడు-విశాఖపట్నం: విశాఖలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో 26 ఏళ్ల క్రితం జరిగిన భయానక ఘటనను ఇప్పటికీ జనం మరచిపోలేదు. నాటి అగ్నిప్రమాదం తీవ్రతకు 60 మంది మృత్యువాత పడిన తీరు తలుచుకుంటే గగుర్పాటు రాకుండా ఉంటుందా? అదే తరహా మరో పెద్ద ప్రమాదం అంచుకు వెళ్లి విశాఖ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి చేపలరేవులో జరిగిన ఘటనతో నగరానికి పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే విశాఖకు మరో కాళరాత్రి మిగిలేది.
మానవ నిర్లక్ష్యంతో అలుముకున్న అచేపలరేవులోని జెట్టీలను రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. కొందరు గంజాయి, మద్యం తాగుతూ అక్కడే సెటిల్మెంట్లు చేస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ... అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కరవైందనే చెప్పాలి. రాత్రిళ్లు పోలీస్ పెట్రోలింగ్ కంటితుడుపే. ఈ లోపాలతోనే లంగరు వేసిన బోట్లలో రాత్రిళ్లు పార్టీలు జోరుగా సాగుతున్నాయి.
గ్నికీలలకు గాలి తోడవడంతో 45 బోట్లు కళ్లముందే బూడిదవగా, అందులోని డీజిల్ బ్యారెల్స్, గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలాయి. నిప్పురవ్వలు జీరోజెట్టీ పరిధిలో ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. ఆ జెట్టీకి అతి సమీపంలోనే హెచ్పీసీఎల్ (విశాఖ ఫిషింగ్ హార్బర్ బంకరింగ్ ఇన్స్టాలేషన్) ఇంధన నిల్వ కేంద్రం ఉంది. దీని పరిధిలోనే వేలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రమాద సమయంలో ప్రతి ఒక్కరిని ఇదే అత్యంత తీవ్రంగా కలవరపరిచింది.
ఆధునికీకరణ పనులు జరుగుతుండగా: హార్బర్ ప్రాధాన్యం గుర్తించిన కేంద్రం సదుపాయాల విస్తరణ, ఆధునికీకరణకు రూ.153 కోట్లు కేటాయించింది. ఏడాది కిందట ప్రధాని మోదీ ఆ పనులకు ప్రారంభోత్సవం చేశారు. కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాల వల్ల బోట్లు నిలిపే ప్రదేశం ఇరుగ్గా ఉంటుందని మత్స్యకారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇలా ఇరుకు ప్రాంతంలోనే బోట్లు నిలపడం ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా దాదాపు 13 గంటలు శ్రమిస్తేకానీ, ఈ మంటలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొందంటే అగ్నిప్రమాద తీవ్రత అర్థమవుతుంది. ఒక్కో బోటుపై 15 మంది జీవనాధారం పొందుతున్నారు. కాలిపోయిన బోట్లపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
ప్రాణభయంతో సిబ్బంది పరుగులు: పేలుళ్లతో బోట్ల నుంచి నిప్పురవ్వలు జెట్టీ సమీపంలోని వేలం కేంద్రం వద్ద చెక్కపెట్టెలపై పడటంతో అవి దగ్ధమయ్యాయి. ఆ నిప్పు రవ్వలే సమీపంలోని హెచ్పీసీఎల్ నిల్వ కేంద్రంపై పడితే ఊహకందని ప్రాణ నష్టమే జరిగేది. మంటలు ఎగసిపడటంతో ఉలిక్కిపడ్డ హెచ్పీసీఎల్లోని సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
అవశేషాలు మాత్రమే మిగిలాయి..: ఐదు నెలల కింద బోటు కొనుగోలు చేశా. దానిపై వేట సాగిస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నా. మరో 8మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నా. ఇటీవలే బోటుకు మరమ్మతులు చేయించా. ఆదివారం అగ్నిప్రమాదంలో బోటు కాలి బూడిదయింది. జెట్టీ జలాల్లో అవశేషాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలా బతకాలో అర్థం కావడం లేదు.
మున్నం బాలాజీ, బోటు యజమాని
ఇటీవల మరమ్మతులు చేయించా..: ఏళ్ల తరబడి బోటును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ .. ఇటీవల మరమ్మతులు చేయించా.. వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అగ్నిప్రమాదంలో బోటు కాలి బూడిదయింది. అవశేషాలు సైతం జెట్టీ జలాల్లో మునిగిపోయాయి. జీవనాధారమైన బోటు ఇక లేదంటే జీర్ణించుకోలేకపోతున్నా. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
- వై.శ్రీనివాసరావు, బోటు యజమాని
వేటకు సన్నద్ధమవుతుండగా...:
సోమవారం తెల్లవారుజామున వేటకు వెళ్లేందుకు నా బోటుకు సిద్ధం చేశా. 24రోజుల పాటు సముద్రంలో ఉండేందుకు అవసరమైన ఆయిల్, నిత్యావసరాలు, ఐస్, ఇతర సామగ్రిని బోటులో నింపాం. ఇంతలో అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. బోటుతోపాటు సామగ్రి కాలిపోయాయి. రూ.30లక్షల వరకు నష్టం వాటిల్లింది. బోటులోని 8మంది మత్స్యకారులు ప్రమాదం తెలిసిన వెంటనే బయటకు వచ్చేశారు.
- గనగళ్ల కోటయ్య
పొలాలు అమ్మి బోటు కొన్నా:
విజయనగరం జిల్లా భోగాపురం మండలం చిన కంచి మా స్వగ్రామం. పొలాలు విక్రయించగా వచ్చిన డబ్బుతో ఆరేళ్ల క్రితం బోటు కొనుగోలు చేశా. నాకు నలుగురు ఆడపిల్లలు. అగ్నిప్రమాదంలో బోటు బూడిదవడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి. ఎం.ఎల్లాజీ అప్పులు తీర్చేదెలా? : చిన్నప్పటి నుంచి కష్టపడి రూపాయి రూపాయి పోగేశాం. దానికి కొంత అప్పు తెచ్చి బోటు కొనుగోలు చేశాం. ఇప్పుడు అగ్నిప్రమాదంలో బోటు పూర్తిగా కాలిపోయింది. మేము ఎలా బతకాలో తెలియడం లేదు. అప్పులు తీర్చకపోతే రుణదాతలు ఒప్పుకోరు. ఈ సమయంలో ప్రభుత్వమే ఆదుకోవాలి.
అమ్మోరమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పచ్చని కుటుంబంపై.. విధి కన్నెర్ర
[ 30-11-2023]
భార్య, భర్త, ఇద్దరు కుమారులతో పచ్చగా ఉన్న ఓ కుటుంబాన్ని విధి వెంటాడింది. వంటగ్యాస్ ప్రమాదంలో కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు కోల్పోయారు. ఉదయం లేచి అందరినీ ఆప్యాయంగా పలకరించే గొంతులు మూగబోయాయి. -
స్పందన పరిష్కారంలో ఏదీ చిత్తశుద్ధి
[ 30-11-2023]
‘జగనన్నకు చెబుదాం’ పేరుతో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో అర్జీదారులు కలెక్టరేట్కు వచ్చి అర్జీల రూపంలో గోడు చెప్పుకుంటున్నా పట్టించుకోవడం లేదు. -
ప్రచార యావ.. ఏదీ కనీస సేవ?
[ 30-11-2023]
ఫైబర్నెట్ సెటప్ బాక్స్లు మరమ్మతులకు గురైతే వాటిని బాగుచేయించే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారులు విసిగిపోతున్నారు. కొవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోం విధానంలో యువతకు అవకాశం లభించింది. దీంతో చాలామంది గ్రామాల్లో ఉంటూ పని చేసుకుంటున్నారు. -
నిర్మాణ రంగంలో నిష్ణాతులయ్యేలా..!
[ 30-11-2023]
భవన నిర్మాణ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు చేయూత ఇస్తోంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్) సంస్థ. ఈ సంస్థను 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. -
కబ్జా దాహం.. అడుగుకో వ్యూహం!
[ 30-11-2023]
కళ్ల ముందు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు విశాఖలో వైకాపా నాయకులు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా కరాస పోలీస్ క్వార్టర్స్ సమీపంలో దాదాపు రూ.16 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పావులు కదిపారు. -
శిథిలాలు తీసేదెవరు.. కష్టాలు తీర్చేదెవరు
[ 30-11-2023]
విశాఖ చేపల రేవులో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో బోట్లు దగ్ధమయ్యాయి. వాటి శిథిలాలు ఇంకా జెట్టీ సమీపంలోనే ఉండిపోయాయి. ప్రత్యేకంగా చర్యలు తీసుకొని వెంటనే వాటిని తీసేస్తామని పోర్టు అధికారులు నాడు పేర్కొన్నా. -
కౌన్సిల్లో 18.. స్థాయీలో 25
[ 30-11-2023]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశం డిసెంబరు 1న, కౌన్సిల్ సమావేశం 6న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అజెండా కాపీలను సభ్యులకు పంపిణీ చేసినట్లు జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య తెలిపారు. -
కొరియర్ ముసుగులో.. గంజాయి అక్రమ రవాణా
[ 30-11-2023]
నగర పరిధిలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కొరియర్, పార్సిల్ సర్వీసుల ద్వారా గంజాయి అక్రమ రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని కొబ్బరితోట పరిసరాల్లో దాడులు జరిపి, ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
అసహనం... ఆవేదన!
[ 30-11-2023]
స్థలాల క్రయవిక్రయానికి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 2.0 ప్రైమ్ (ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇంటిగ్రేషన్ మ్యుటేషన్ మేడ్ ఈజీ) విధానంలో చిక్కుముడులు వీడడం లేదు. కొత్త విధానం తీసుకువచ్చి నెలరోజులు కావస్తున్నా సమస్యలను ఉన్నతాధికారులు పరిష్కరించడంలో అశ్రద్ధ వహిస్తున్నారు. -
పట్టాలు తప్పిన రైలు..!
[ 30-11-2023]
గోపాలపట్నంలోని సింహాచలం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి, మూడు బోగీలు పక్కకు ఒరిగాయి. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. -
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
[ 30-11-2023]
జీవీఎంసీ రెండోవార్డుకు చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు భీమిలి సీఐ రమేశ్ పేర్కొన్నారు. ఆ వివరాలిలా..వలందపేటకు చెందిన టైల్స్ పని చేసే కోనాడ పోలిరాజు(27)కు రామలక్ష్మీ అనే యువతితో మూడేళ్ల... -
‘మృతుల ఓట్లు 10 వేలపైనే..’
[ 30-11-2023]
జిల్లాలో ఓటర్ల జాబితా అంతా తప్పులతడకగా ఉందని తెదేపా జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
టన్ను చెరకు ధర రూ. 2,919.75
[ 30-11-2023]
ఈ ఏడాది (2023-24 సీజన్) గోవాడ చక్కెర కర్మాగారం గానుగాటకు చెరకు సరఫరా చేసే రైతులకు టన్నుకు రూ. 2,919.75 చెల్లించనున్నట్లు కర్మాగారం యాజమాన్య సంచాలకుడు (ఎండీ) వి.సన్యాసి నాయుడు తెలిపారు. -
యువగళం విజయవంతం చేయాలి
[ 30-11-2023]
పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో త్వరలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించే ‘యువగళం’ పాదయాత్రను విజయవంతం చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కోరారు. -
పెత్తందారులకు ఎమ్మెల్యే బాబూరావు వత్తాసువైకాపా ఎస్సీ
[ 30-11-2023]
పేట అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు ఎస్సీ రిజర్వేషన్పై గెలుపొంది నియోజకవర్గంలో పెత్తందారులకు వత్తాసుగా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎస్సీ సెల్ నాయకులు డొక్కుమళ్ల నానాజీ, పల్లా ప్రసాద్, చలికే గోవింద్ తెలిపారు. -
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు
[ 30-11-2023]
జాతీయ రహదారి వెంబడి ప్రమాదాలు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. పాయకరావుపేట పోలీసుస్టేషన్ను బుధవారం ఎస్పీ సందర్శించారు. -
నర్సీపట్నం ఆసుపత్రిలో ఇంత దారుణమా?
[ 30-11-2023]
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని దారుణమైన పరిస్థితికి తీసుకువచ్చారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ-టీడీపీ ఇన్ఛార్జి చింతకాయల విజయ్ విమర్శించారు. మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామానికి చెందిన తమరాన లక్ష్మమ్మ (73).... -
ప్రధానోపాధ్యాయినిపై ఎమ్మెల్యే ఆగ్రహం
[ 30-11-2023]
ఇంటర్ విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించడంపై ఎలమంచిలి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని హిమబిందుపై ఎమ్మెల్యే రమణమూర్తి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రజల్లో విశ్వాసం పెంచేలా ఓటర్ల జాబితా తయారీ
[ 30-11-2023]
జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సమర్ధంగా పనిచేయాలని కలెక్టర్ రవి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఎన్నికల ప్రక్రియపై ఈఆర్వోలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. -
సాగరంలో శత్రు సంహారం
[ 30-11-2023]
సన్నాహక విన్యాసాలతో సాగరతీరంలో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. డిసెంబరు 4న నావికా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. -
ఘనంగా జబర్దస్త్ ఫేం ఆర్పీ వివాహం
[ 30-11-2023]
జబర్దస్త్ ఫేమ్ రాచకొండ ప్రసాద్ (ఆర్.పి) వివాహ వేడుకలు నగరంలోని పామ్బీచ్ హోటల్లో బుధవారం సంప్రదాయబద్ధంగా జరిగాయి.


తాజా వార్తలు (Latest News)
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్ఇండియాతోనూ బజ్బాల్!
-
TS Polling: ఓటేసేందుకు వచ్చి.. ఇద్దరు వృద్ధులు మృతి
-
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్