మొక్క.. బతకాలి ఎంచక్కా
గ్రామాల్లో మొక్కల్ని పెంచే బాధ్యతలను పంచాయతీలకు అప్పగించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్వామా పర్యవేక్షణలో రెండేళ్లుగా జగనన్న పచ్చతోరణం పథకం కింద మొక్కల్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఇవి పూర్తిస్థాయిలో
రెండేళ్ల పాటు పంచాయతీలకు సంరక్షణ బాధ్యతలు
పచ్చతోరణం పథకంలో నాటిన మొక్కలు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: గ్రామాల్లో మొక్కల్ని పెంచే బాధ్యతలను పంచాయతీలకు అప్పగించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్వామా పర్యవేక్షణలో రెండేళ్లుగా జగనన్న పచ్చతోరణం పథకం కింద మొక్కల్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఇవి పూర్తిస్థాయిలో బతికేలా సర్పంచులు బాధ్యతలు తీసుకోవాలని, అది 85-90 శాతానికి మించి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో కి.మీ.కు 400 చొప్పున 1117.1 కి.మీ. మేర మొక్కలు నాటారు. వాటి కోసం 1,04,920 ట్రీగార్డులు కేటాయించారు. ఇవి చాలని చోట ప్రత్యామ్నాయంగా వెదురు, గట్టి కర్రలు లేదా ముళ్ల కంచెలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లపాటు వాటి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు వేతనదారుల్ని ఎంపిక చేశారు. ప్రతి రెండు వందల మొక్కలకు గ్రామపంచాయతీ ఆమోదంతో ఒక వేతనదారుడ్ని ఎంపిక చేశారు. నెలకు రూ.4 వేలను ఆయన బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. వేతనదారులకు వేతనం అందాలంటే వాటిని బతికించాలనే నిబంధనను కూడా ప్రభుత్వం విధించింది. మొక్కలకు నీటి తడుపుల కింద నెలకు ఒకసారి రూ.1700 చెల్లిస్తారు. మొదటి సంవత్సరం ఎనిమిదినెలలు, రెండో ఏడాది 12 నెలలు చెల్లిస్తారు. ఏడాదికి 30 సార్లు తడులు పెట్టాలి. ఈ మొత్తాన్ని మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో చెల్లిస్తారు.
పర్యవేక్షిస్తున్నాం: ఈ ఏడాది ఆరడుగులు దాటిన మొక్కలే నాటాం. పశువులు తినేందుకు వీలు లేకపోవడంతో తొందరగా ఇవి ఎదిగి, ఎక్కువ బతికే అవకాశముంది. గతేడాది 68-70 శాతం మాత్రమే బతికాయి. పంచాయతీల్లో సర్పంచి, గ్రామ కార్యదర్శి, క్షేత్రసహాయకులు, మండల స్థాయిలో ఏపీవో, ఎంపీడీవో, జిల్లాలో జడ్పీ సీఈవో, పంచాయతీ అధికారిణి పర్యవేక్షిస్తారు. ప్రతి మొక్కను బతికించేలా అన్ని స్థాయిల్లో పర్యవేక్షిస్తున్నాం. - ఉమాపరమేశ్వరి, పీడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ
చేపట్టిన పనులు - 1343
కిలోమీటర్లు- 1117.1
నాటిన మొక్కలు- 4,46,838
వ్యయం - 409.29 (రూ.లక్షల్లో)
ప్రస్తుతం బతికున్నవి: 98.13శాతం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!