logo

నవరసాల స్వరశాల.. ఘంటసాల

నవరసాల స్వరశాల..ఘంటసాల సినీ జగత్తులో మధురగాయకుడిగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు భీష్మారావు కొనియాడారు

Published : 05 Dec 2021 05:17 IST


విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు, ప్రతినిధులు

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: నవరసాల స్వరశాల..ఘంటసాల సినీ జగత్తులో మధురగాయకుడిగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు భీష్మారావు కొనియాడారు. ఆయన జయంత్యుత్సవాన్ని శనివారం గుమ్చీలో ఘనంగా నిర్వహించారు. అమర గాయకుడి విగ్రహానికి పూలమాలలు వేసి, క్షీరాభిషేకం చేశారు. ఆయన స్ఫూర్తిని నేటి గాయకులు అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో పి.వి.నర్సింహరాజు, ధవళ సర్వేశ్వరరావు, అబ్బులు, గోపాలరావు, కాపుగంటి ప్రకాష్‌, డాక్టర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని