గండం గట్టెక్కినట్టే
‘జవాద్’ బలహీనపడటంతో గండం తప్పినట్లేనని యంత్రాంగం భావిస్తోంది. జిల్లాలో శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రికి తీరం అల్లకల్లోలంగా మారింది. పూసపాటిరేగ మండలం చింతపల్లిలో
శనివారం రాత్రి ముక్కాం తీరంలో సముద్రం మరింత
ముందుకు రావడంతో పడవల్ని ఒడ్డుకు చేరుస్తున్న మత్స్యకారులు
ఈనాడు-విజయనగరం, కలెక్టరేట్, భోగాపురం, పూసపాటిరేగ, న్యూస్టుడే: ‘జవాద్’ బలహీనపడటంతో గండం తప్పినట్లేనని యంత్రాంగం భావిస్తోంది. జిల్లాలో శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రికి తీరం అల్లకల్లోలంగా మారింది. పూసపాటిరేగ మండలం చింతపల్లిలో సముద్రం 120 అడుగులు ముందుకొచ్చింది. తుపాను ఆదివారం మధ్యాహ్నం తీరం దాటవచ్చని, అప్పటి వరకు ప్రస్తుత పరిస్థితులనే కొనసాగించాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. పోలి పాఢ్యమి సందర్భంగా నదీ, సముద్రాల్లో స్నానాలకు మహిళలను అనుమతించవద్దన్నారు. పునరావాస కేంద్రాలను కొనసాగిస్తామని ప్రకటించారు.
ప్రత్యేక పర్యవేక్షణ
తుపాను శనివారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. 154 పునరావాస కేంద్రాల్లో 3260 మంది మత్స్యకారులకు ఆశ్రయం కల్పించగా.. నదులు, చెరువుల సమీపంలో పాకల్లో ఉన్న 1300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 50 మంది గర్భిణులను ఆసుపత్రుల్లో చేర్పించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్లో రాత్రి రెండు గంటల వరకు జేసీలు ఆర్.మహేష్కుమార్, మయూర్ అశోక్, తర్వాత నుంచి కలెక్టర్ సూర్యకుమారి, జేసీ కిషోర్కుమార్ ఉండి పరిస్థితులను పర్యవేక్షించారు. జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెల్లవారుజాము రెండు గంటల వరకు భోగాపురంలోనే ఉండి పరిస్థితులపై సమీక్షించారు.
19 మండలాల్లో పునరావాస శిబిరాలు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: జిల్లాలోని 19 మండలాల్లో పునరావాస శిబిరాలకు ఏర్పాట్లు చేశామని జడ్పీ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగా ఏడు మండలాల్లోని 13 పంచాయతీల్లో 361 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించామన్నారు. దత్తిరాజేరు మండలం పెదమానాపురం, దాసుపేట, పెదకాద, ఆర్.ఆర్.పురం, బొండపల్లిలో గొల్లుపాలెం, పాత పనసలపాడు, తెర్లాంలో సుందరాడ, భోగాపురంలో భోగాపురం, డెంకాడలో చొల్లంగిపేట, పూసపాటిరేగలో తిప్పలవలస, ఎస్.కోటలో రెల్లివీధి, పోతనాపల్లి, గంట్యాడలో గంట్యాడ పంచాయతీల్లోని వారిని తరలించినట్లు చెప్పారు.
చింతపల్లిలో పోలీసులకు సూచనలు చేస్తున్న డీఎస్పీ అనిల్కుమార్
ఉదయం నుంచి పస్తులు
భోగాపురం, న్యూస్టుడే: భోగాపురం ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రంలోని నిర్వాసితులకు శనివారం సాయంత్రం 4 గంటల వరకు భోజన ఏర్పాట్లు చేయలేదు. పస్తులతో ఉన్నామని, ఒక్క అధికారి కూడా ఇటు రాలేదని నిర్వాసితులు ‘ఈనాడు-ఈటీవీ’ ముందు వాపోయారు. శుక్రవారం రాత్రి ఏదో అన్నం పెట్టి, విద్యుత్తు సౌకర్యం లేని భవనంలో వదిలి వెళ్లారన్నారు. తహసీల్దారు రమణమ్మ స్పందించి అప్పటికప్పుడు వంట చేయించి ఆరు గంటలకు భోజనాలు ఏర్పాటు చేశారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ ఉండలేమంటూ బాలింతలు పిల్లల్ని తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం రాత్రి చీకట్లోనే బస చేశారు.
ఆందోళనొద్ధు. అప్రమత్తంగా ఉన్నాం: బొత్స
మాట్లాడుతున్న మంత్రి సత్యనారాయణ
కలెక్టరేట్, న్యూస్టుడే: జవాద్పై ప్రజలు ఆందోళన చెందవద్దని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తుపాను ఒడిశాలో పూరీ వద్ద తీరం దాటనుందని, అయినప్పటికీ ఉత్తరాంధ్రలో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు శనివారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే విజయనగరం, పార్వతీపురం డివిజన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని వివరించారు. రైతులు నష్టపోకుండా 1,500 టార్పాలిన్లను అందజేశారని వివరించారు. ధాన్యం రంగు మారినా, ముక్కినా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ప్రత్యేకాధికారి కాంతిలాల్దండే, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, సంయుక్త కలెక్టర్లు కిశోర్కుమార్, మహేష్కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో ఎం.గణపతిరావు, ఆర్డీవో భవానీశంకర్ పాల్గొన్నారు.
భోగాపురం ఉన్నత పాఠశాలలో నిర్వాసితులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను ఉన్నానన్నావ్.. విన్నానన్నావ్.. ఐదేళ్లుగా ఏం చేశావ్!
[ 23-04-2024]
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు. -
ఎస్.కోటను అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. -
పదిలో అయిదో స్థానం
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
వైకాపా పతనం తప్పదు: కళా
[ 23-04-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. -
పార్లమెంటుకు 05 .. అసెంబ్లీకి 24
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి 05, అసెంబ్లీ స్థానాలకు 24 వచ్చాయి. ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ రెండు సెట్ల నామపత్రాలు అందజేశారు. -
కోటలో జనసంద్రం
[ 23-04-2024]
శృంగవరపుకోటలో చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం సభకు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జగ్గంపేట సభ అనంతరం వచ్చిన చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద అభ్యర్థులు శ్రీభరత్, కోళ్ల లలితకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, కార్యదర్శి ఐ.సుధారాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ, భాజపా నియోజకవర్గ కన్వీనర్ జగదీశ్వరి స్వాగతం పలికారు. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలు
[ 23-04-2024]
అరకు పార్లమెంటరీ.. -
నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
[ 23-04-2024]
కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్కుమార్ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. -
ప్రకటనల మోత.. ఏదీ రైలుబస్సు కూత
[ 23-04-2024]
మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్లో రైలు కూత వినిపించకుండా పోయింది. -
ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సామే
[ 23-04-2024]
నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
జగన్ చెప్పారంటే.. చేయరంతే!
[ 23-04-2024]
ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. -
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్ 600కు 592, ఎం.హర్షవర్థన్ 592, కె.రాకేష్ 590 మార్కులు సాధించారు. -
‘ప్రజల్ని దోచేసిన వైకాపా’
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజల కష్టాన్ని అధిక ధరలు, ఛార్జీల రూపంలో దోచేసిందని కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలం కోడూరు, ఏనుగువలస గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM