logo

తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మృతికి కలెక్టరేట్‌లో శనివారం బొత్స నివాళులర్పించారు. భేషజాలకు పోకుండా, ఎంతో అనుభవంతో రోశయ్య పని చేసేవారని కొనియాడారు

Published : 05 Dec 2021 05:17 IST


చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న డీసీసీ ప్రతినిధులు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మృతికి కలెక్టరేట్‌లో శనివారం బొత్స నివాళులర్పించారు. భేషజాలకు పోకుండా, ఎంతో అనుభవంతో రోశయ్య పని చేసేవారని కొనియాడారు. 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆయన మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పేర్కొన్నారు.

మయూరి కూడలి, న్యూస్‌టుడే: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా విశిష్ట సేవలు అందించిన కె.రోశయ్య మరణం తీరని లోటని డీసీసీ అధ్యక్షుడు ఎస్‌.రమేష్‌కుమార్‌ అన్నారు. శనివారం విజయనగరం డీసీసీ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌.సతీష్‌కుమార్‌, శ్రీను, అప్పలనాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని