logo

11న జాతీయ లోక్‌ అదాలత్‌

రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులంతా కేసుల్ని పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్‌ చక్రవర్తి సూచించారు. ఈ నెల 11న జిల్లావ్యాప్తంగా న్యాయస్థానాల్లో లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు శనివారం చెప్పారు.

Published : 05 Dec 2021 05:17 IST

విజయనగరం నేర, న్యాయ వార్తా విభాగాలు, న్యూస్‌టుడే: రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులంతా కేసుల్ని పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్‌ చక్రవర్తి సూచించారు. ఈ నెల 11న జిల్లావ్యాప్తంగా న్యాయస్థానాల్లో లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు శనివారం చెప్పారు. ఇప్పటికే వాహన, బ్యాంకు, సివిల్‌, క్రిమినల్‌ కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని