logo

గెడ్డలో పడి పశువుల కాపరి మరణం

మండలంలోని వంగర గ్రామానికి చెందిన కొల్లి సత్యం(40) పోతల గెడ్డలో పడి మృతి చెందినట్లు ఎస్సై భాగ్యం తెలిపారు. ఆమె వివరాల ప్రకారం... సత్యం ఎప్పటిలాగే శుక్రవారం పశువులను మేపేందుకు గెడ్డ వైపు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా

Published : 05 Dec 2021 05:17 IST

కొల్లి సత్యం (పాత చిత్రం)

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: మండలంలోని వంగర గ్రామానికి చెందిన కొల్లి సత్యం(40) పోతల గెడ్డలో పడి మృతి చెందినట్లు ఎస్సై భాగ్యం తెలిపారు. ఆమె వివరాల ప్రకారం... సత్యం ఎప్పటిలాగే శుక్రవారం పశువులను మేపేందుకు గెడ్డ వైపు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతల, ఏడొంపుల గెడ్డ కలిసే చోట సత్యం మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి, శనివారం సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య మంగమ్మ, కుమార్తె రాజేశ్వరి, కుమారుడు మోహన్‌ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని