logo

బలిజిపేటలో తెదేపా గౌరవ సభ

అసెంబ్లీలో మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన వైకాపా నాయకుల తీరును నిరసిస్తూ బలిజిపేటలో తెదేపా ఆధ్వర్యంలో గౌరవ సభ ..

Updated : 05 Dec 2021 19:03 IST

బలిజిపేట : అసెంబ్లీలో మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన వైకాపా నాయకుల తీరును నిరసిస్తూ బలిజిపేటలో తెదేపా ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించారు. బస్టాండు ఆవరణలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, తెదేపా పార్వతీపురం ఇన్‌ఛార్జ్‌ బొబ్బిలి చిరంజీవులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ కూడలి వద్ద రహదారిపై గౌరవ సభ నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు జి.వెంకటనాయుడు, బలిజిపేట మండలాధ్యక్షుడు వేణుగోపాల నాయుడు, అరకు పార్లమెంటు కార్యదర్శి అప్పారావు, వి.రామకృష్ణ, ఎ.వెంకట రమణ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని