logo

ఆలయాల్లో పోలి పాడ్యమి పూజలు

కార్తికమాసం ముగిసిన నేపథ్యంలో పోలి పాడ్యమి పూజలను భక్తులు శైవ క్షేత్రాల్లో నిర్వహించారు. ..

Updated : 05 Dec 2021 19:04 IST

బలిజిపేట : కార్తికమాసం ముగిసిన నేపథ్యంలో పోలి పాడ్యమి పూజలను భక్తులు శైవ క్షేత్రాల్లో నిర్వహించారు. సమీప నదుల్లో, చెరువుల్లో స్నానాలు ఆచరించి అక్కడే దీపాలు వెలిగించారు. అనంతరం శివలింగాలను దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది భక్తులు ఆలయాల ఆవరణలో ప్రసాదాలు పంపిణీ చేశారు. గళావల్లి, నారాయణపురంలోని పురాతన దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని