logo

పేదలకు వితరణ

బలిజిపేట మండలంలోని పణుకువలసలో బంకపల్లి సింహాచలం నాయుడు, త్రినాథనాయుడు ఆధ్వర్యంలో 250 మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. బలిజిపేటలో పెరికబలిజ కార్పొరేషన్‌ డైరెక్టరు ఎన్‌.శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌,

Published : 17 Jan 2022 05:58 IST


పణుకువలసలో వస్త్రాలు ఇస్తున్న దాతలు

బలిజిపేట, బలిజిపేటగ్రామీణం, సీతానగరం, రామభద్రపురం, తెర్లాం, పాచిపెంట, న్యూస్‌టుడే: బలిజిపేట మండలంలోని పణుకువలసలో బంకపల్లి సింహాచలం నాయుడు, త్రినాథనాయుడు ఆధ్వర్యంలో 250 మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. బలిజిపేటలో పెరికబలిజ కార్పొరేషన్‌ డైరెక్టరు ఎన్‌.శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌, సత్యసాయి సేవాసమితి కన్వీనరు సుబ్బారావు దుప్పట్లు, చీరలు అందజేశారు. ● సీతానగరం మండలం పెదంకలాం సర్పంచి బి.శ్రీనివాసరావు వంద కుటుంబాలకు చీరలు, దుప్పట్లు ఇచ్చారు. ● రామభద్రపురానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు తూముల దాలినాయుడు రూ.లక్ష విలువైన దుప్పట్లు, పంచెలు, చీరలు, పండ్లు వితరణ చేశారు. ● పాచిపెంట గ్రామానికి చెందిన బిలివాడు ధర్మారావు, కన్నతల్లి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 30 మందికి రగ్గులు, చీరలు అందజేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని