స్వచ్ఛత కనుమరుగు
బహిరంగ మల, మూత్ర విసర్జన సాంఘిక నేరం. దీన్ని అరిట్టేందుకు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ను ఆరేళ్లు కిందట అమలు చేసింది. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, పట్టణాల్లో మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో సామాజిక మరుగుదొడ్లు నిర్మించింది.
నిర్వహణకు నోచుకోని మరుగుదొడ్లు
అపరిశుభ్రతకు నిలయాలుగా పరిసరాలు
సాలూరు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి పక్కనున్న ఈ సామాజిక మరుగుదొడ్లు వినియోగానికి దూరమయ్యాయి. బోర్లు పనిచేయక, నీటి సరఫరా లేక వాడటం లేదు. పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది నదీ ప్రాంతంలో బహిరంగ మలవిసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది.
సాలూరు, విజయనగరం పట్టణం, బొబ్బిలి, బెలగాం, న్యూస్టుడే: బహిరంగ మల, మూత్ర విసర్జన సాంఘిక నేరం. దీన్ని అరిట్టేందుకు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ను ఆరేళ్లు కిందట అమలు చేసింది. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, పట్టణాల్లో మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో సామాజిక మరుగుదొడ్లు నిర్మించింది. రూ.కోట్లు ఖర్చు చేశారు. బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలు, ప్రశంసాపత్రాలు ఇచ్చారు. ఇదంతా గతం. ప్రస్తుతం సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ, వినియోగం అధ్వానంగా మారింది. పురపాలికలు, నగర పాలక సంస్థలో పదుల సంఖ్యలో మరుగుదొడ్లు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. ఏళ్లు గడుస్తున్నాయి తప్ప వాటి బాగుకు చర్యలు శూన్యం. మురికివాడల్లో నివసించే ప్రజలు బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు.పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.
నేతలు వస్తే మూతలే: మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలనుకుంటే గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారని ప్రభుత్వ అధికారులు పనులు చేయించలేక మిన్నకుండిపోతున్నారు. పట్టణాలకు మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చిన ప్రతిసారీ వాటిని రంగుల పరదాలతో మూసేస్తున్నారు. 2019 అక్టోబరులో సాలూరుకు గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ వచ్చినప్పుడు మక్కువ బైపాస్ రోడ్డు పక్కన, 2020 డిసెంబరులో మంత్రి బొత్స ప్రభుత్వాసుపత్రి పనుల శంకుస్థాపనకు వచ్చినపుడు వారి కంటపడకుండా పాడైన మరుగుదొడ్లను గుడ్డలతో కప్పి మూసేశారు.
విజయనగరం సుద్ధవీధిలో ఇలా..
నిర్వహణకు వెనకడుగు
సామాజిక మరుగుదొడ్ల నిర్వహణకు కొన్ని మహిళా సంఘాలు, పారిశుద్ధ్య కార్మిక సంఘాల నాయకులు వెనకడుగు వేస్తున్నారు.సకాలంలో బిల్లులు చెల్లించక పోవడమే కారణం. విద్యుత్తు మోటార్లు కాలిపోయి, బోర్లు పనిచేయక, చేసిన వాటికి బిల్లులు చెల్లించక పోవడంతో రెండేళ్లుగా మూలకు చేరాయి. అత్యవసర పనుల్లో భాగంగా వీటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉన్నా...అలా చేయడం లేదు.
అధికారులు ఏమన్నారంటే: మరమ్మతులకు గురైన మరుగుదొడ్లను గుర్తించాం. పనులు చేయించి వినియోగంలోకి తెస్తాం. వాటిని నిర్వహించేవారికి బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాం. బహిరంగ మలవిసర్జన జరగకుండా చూస్తామని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు కమిషనర్లు ఎస్ఎస్ వర్మ, పి.సింహాచలం, ఎస్. శ్రీనివాసరావు, హెచ్. శంకరరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యర్థుల ఖర్చు వారి ఖాతాల్లోనే జమ
[ 20-04-2024]
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనందకుమార్, ఆకాష్దీప్ ఆదేశించారు. -
ఎన్నికల హోరు.. నామినేషన్ల జోరు
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. శుక్రవారం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి 6, అసెంబ్లీ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. -
కదిలిన పసుపు దండు
[ 20-04-2024]
జిల్లా కేంద్రం శుక్రవారం పసుపుమయమైంది. తెదేపా నుంచి ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ వేసేందుకు అశోక్ బంగ్లాకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. -
ఎస్ కోటలో 22న చంద్రబాబు పర్యటన
[ 20-04-2024]
శృంగవరపుకోట పట్టణంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన 22వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఖరారు అయింది. ముందుగా 21వ తేదీన పర్యటన ఉంటుందని సమాచారం వచ్చింది. -
బొబ్బిలిలో మార్పు మొదలైంది
[ 20-04-2024]
బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వైకాపా నుంచి తెదేపాలోకి పలువురు వాలంటీర్లు, ముఖ్య నేతలు చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి పలువురు వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
అయిదేళ్లలో బొత్స సోదరుల ఆస్తులు రెట్టింపు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు అధిక సంఖ్యలోనే దాఖలయ్యాయి. శృంగవరపుకోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అఫిడవిట్ దాఖలు చేయలేదు. -
వాహనాల్లో కుక్కేశారు.. ట్రాఫిక్లో ఉంచేశారు
[ 20-04-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు. -
తరలింపు వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
[ 20-04-2024]
నామినేషన్ ఘట్టానికి వైకాపా కార్యకర్తలను తరలించిన ఆటో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రాజాన దిలీప్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. -
ఉల్లంఘనలు కనిపించడం లేదా?
[ 20-04-2024]
పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు ఏం చేసినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. -
ప్రజలకు జగనన్న షాక్
[ 20-04-2024]
తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా బాకా ఊదారు సీఎం జగన్. బాదుడే.. బాదుడు అంటూ అప్పటి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేశారు. దీంతో నిజమని నమ్మేశారు కొందరు ప్రజలు. -
చందనోత్సవ వైఫల్యాలపై నివేదిక ఏదీ..?: అశోక్
[ 20-04-2024]
సింహాచలం దేవస్థానంలో గతేడాది చందనోత్సవ సమయంలో జరిగిన వైఫల్యాలపై చేపట్టిన విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. -
ఉప్పొంగిన అభిమానం
[ 20-04-2024]
రాజాం పట్టణం జనసంద్రమైంది. కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ నామినేషన్ సందర్భంగా మండుటెండను సైతం లెక్క చేయకుండా వివిధ మండలాల నుంచి చేరుకున్న వేలాది మంది గంటల కొద్దీ ర్యాలీలో పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్
[ 20-04-2024]
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్కు రోజులు దగ్గర పడ్డాయని, వైకాపా వచ్చిన తర్వాత దోపిడీ ఎక్కువైందని చీపురుపల్లి ఎన్డీయే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?