logo

20న కలెక్టరేట్‌ ముట్టడి

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై పునఃపరిశీలన చేయాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండు చేశారు. సోమవారం ఏపీటీఎఫ్‌-257 కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాప్టో సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను యథావిధిగా

Published : 18 Jan 2022 05:35 IST


సంఘీభావం తెలుపుతున్న ఫ్యాప్టో నాయకులు

విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై పునఃపరిశీలన చేయాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండు చేశారు. సోమవారం ఏపీటీఎఫ్‌-257 కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాప్టో సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను యథావిధిగా కొనసాగించాలని, అశుతోష్‌మిశ్రా నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. ఆయా డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 20న ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించనున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు టి.సన్యాసిరాజు, డి.రాము, రమేష్‌చంద్ర పట్నాయక్‌, డి.ఈశ్వరరావు, డి.శ్యామ్‌, ఎన్‌.వి.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని