logo

సైబర్‌ నేరాలను సవాల్‌గా తీసుకోండి: డీజీపీ

రాష్ట్రంలో రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని, ఆయా కేసులను సవాల్‌గా తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశించారు. సైబర్‌ నేరాల నియంత్రణపై స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు

Published : 18 Jan 2022 05:35 IST


దూరదృశ్య సమావేశంలో మాట్లాడుతున్న గౌతం సవాంగ్‌

నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని, ఆయా కేసులను సవాల్‌గా తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశించారు. సైబర్‌ నేరాల నియంత్రణపై స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 100 మందికి రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. సైబర్‌ కేసులను ఛేదించే నిపుణులుగా వీరిని తీర్చిదిద్దనున్నామన్నారు. నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌, పీటీసీ ఉప ప్రధానాచార్యులు వెంకట అప్పారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని