logo

జ్యోతి బసుకు సీపీఎం నివాళులు

సీపీఎం ఉద్యమ సారథి, పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా పనిచేసేవారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యమ్మల మన్మథరావు

Updated : 18 Jan 2022 16:37 IST

బలిజిపేట: సీపీఎం ఉద్యమ సారథి, పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా పనిచేసేవారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యమ్మల మన్మథరావు అన్నారు. బలిజిపేట సీటూ కార్యాలయంలో మంగళవారం జ్యోతి బసు 12వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారని పలువురు వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటరమణ, ప్రసాద్‌, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని