logo

ఎన్టీఆర్‌కు తెదేపా నాయకుల నివాళి

తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు వర్ధంతి కార్యక్రమాన్ని బలిజిపేటలో తెదేపా నాయకులు మంగళవారం నిర్వహించారు. బస్టాండుకు సమీపంలో

Updated : 18 Jan 2022 16:46 IST

బలిజిపేట: తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు వర్ధంతి కార్యక్రమాన్ని బలిజిపేటలో తెదేపా నాయకులు మంగళవారం నిర్వహించారు. బస్టాండుకు సమీపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ అధ్యక్షులు పెంకి వేణుగోపాలనాయుడు, రాష్ట్ర నాయకులు మండల పెదపాపినాయుడు, రాము, ఎం.అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు. 

మరోవైపు కరోనా లక్షణాలతో బాధపడుతున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్‌ త్వరగా కోలుకోవాలంటూ స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద వంద కొబ్బరికాయలు కొట్టి తెదేపా నాయకులు పూజలు చేశారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ కార్యదర్శి ఎం.అప్పారావు, వి.రామకృష్ణ, బంకపల్లి సింహాచలంనాయుడు, అలమండ వెంకటరమణ, ప్రసాదరావు, భాస్కరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని