నేడు గురువుల కలెక్టరేట్ ముట్టడి
పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన రెండోరోజూ కొనసాగింది. గురువారం కలెక్టరేట్ను ముట్టడించనున్నారు. తరగతులకు ఇబ్బంది కలిగించకుండా 50శాతం మంది విధులకు
50 శాతమే విధులకు హాజరు
మిగిలిన వారంతా ఉద్యమంలోనే..
బొండపల్లి జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుల నిరసన
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన రెండోరోజూ కొనసాగింది. గురువారం కలెక్టరేట్ను ముట్టడించనున్నారు. తరగతులకు ఇబ్బంది కలిగించకుండా 50శాతం మంది విధులకు హాజరయ్యేందుకు, మిగిలిన వారంతా సెలవులు పెట్టి ఉద్యమంలో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. సుమారు నాలుగువేల మంది పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఉదయం తొమ్మిది గంటలకే కలెక్టరేట్కు చేరుకోవాలని సంఘాల నాయకత్వాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. కలెక్టరేట్ లోపలికి విధులకు ఉద్యోగులు వెళ్లకుండా అడ్డుకోనున్నట్లు, అరెస్టులకు బెదరకుండా ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను చాటి చెప్పనున్నట్లు తెలిపారు.
ఉద్యోగ సంఘాల మద్దతు: ఉపాధ్యాయుల పోరాటానికి ఉద్యోగ సంఘాలు పెద్దసంఖ్యలో మద్దతు తెలిపాయి. తొలుత ఏపీసీపీఎస్ఈఏ, సీపీఎస్ ఉద్యోగ సంఘాలే మద్దతు ప్రకటించాయి. మంగళవారం అమరావతిలో చర్చల అనంతరం ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి సంఘాలతో పాటు వైద్య, ఆర్టీసీ, పింఛనుదార్లు తదితర జిల్లాలో సుమారు వంద ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయుల పోరాటానికి మద్దతిచ్చినట్లు ఫ్యాప్టో నాయకులు చెబుతున్నారు.
ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి: ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. యూటీఎఫ్, ప్రధానోపాధ్యాయ, ఏపీటీఎఫ్ 1938, ఏపీటీఎఫ్ 257, ఎస్టీయూ, ఎస్సీ ఎస్టీ, బీటీఏ, ఆప్టా, ఆదివాసీ ఉపాధ్యాయ తొమ్మిది సంఘాలున్నాయి. ఇవే కాకుండా ఫ్యాప్టోలో లేని పీఆర్టీయూ, ఆపస్, ఎస్సీ, ఎస్టీ(రెండోది), పీఈటీ, ఆర్యూపీపీ తదితర సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలియజేసినట్లు ఫ్యాప్టో ఛైర్మన్ టి.సన్యాసిరాజు, కో-ఛైర్మన్ జేఏవీఆర్కే ఈశ్వరరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట