వేస్తారా..వదిలేస్తారా..!
అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు. వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలకూ ఇబ్బందే. రాళ్లు తేలిన రహదారులు, గతుకుల మార్గాలు. దశాబ్దాలుగా గిరిజన గ్రామాల రహదారుల దుస్థితి ఇది. సుమారు రెండేళ్ల కిందట ఉపాధి హామీ పథకంలో
కొమరాడ మండలంలోని కెమిశిల నుంచి గాజులగూడకు వెళ్లే దారి ఇది. ఐదు కి.మీ. మేర రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల కిందట పిక్క తెచ్చి వేశారు. ఇప్పటికి పనులు పూర్తి చేయలేదు. పిక్క రోడ్డుపైకి చేరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమిశిల నుంచి గాజులగూడ, బందవలస, మర్రిగూడ, నాయుడువలస నుంచి లాబేసు వంతెన వరకు మొత్తం 13 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.2.29 కోట్లు మంజూరు చేశారు. బిల్లుల్ని ఆలస్యం చేస్తున్నారని గుత్తేదారు పనులు మధ్యలోనే ఆపేశారు.
ఈనాడు-విజయనగరం, పార్వతీపురం/గ్రామీణం, కొమరాడ, కురుపాం గ్రామీణం, న్యూస్టుడే: అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు. వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలకూ ఇబ్బందే. రాళ్లు తేలిన రహదారులు, గతుకుల మార్గాలు. దశాబ్దాలుగా గిరిజన గ్రామాల రహదారుల దుస్థితి ఇది. సుమారు రెండేళ్ల కిందట ఉపాధి హామీ పథకంలో రోడ్లు వేయడానికి సిద్ధమవ్వడంతో కష్టాలు తీరుతున్నాయని గిరిజనులు సంబరపడ్డారు. కొన్ని గ్రామాలకు తారురోడ్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. పూర్తి చేయకుండానే వాటిని మధ్యలోనే ఆపేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు కొన్ని సాంకేతిక లోపాలు అవరోధంగా మారాయి.
పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో సుమారు 400 గ్రామాలకు రహదారులు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో 225 చోట్ల పనులకు 40 ఎంఎం మెటల్ వేశారు. ఇలా 80 వరకు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కొన్నింటికి ఎటువంటి చెల్లింపులు చేయకపోవడంతో వాటిని పూర్తిగా రద్దు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రహదారులను ఒక క్రమంలో అభివృద్ధి చేయాలనేది కేంద్రం లక్ష్యం. ముందుగా రహదారి సౌకర్యం లేని చోట్ల రోడ్లను వేసి, తర్వాత వాటిని దశల వారీగా మట్టిదారులుగా.. తారు రోడ్లుగా మార్చాలని నిర్ణయించారు. మూడో దశకు వచ్చే సరికి చాలాచోట్ల పనులు నిలిచిపోయాయి. తారురోడ్లు వేయకుండా వదిలేశారు. నిధులు లేకపోవడంతో ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రోడ్లను మెరుగుపరచడానికి కేవలం రూ.50 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. ఈ నిధులు కిలోమీటరు రహదారిని బీటీగా మార్చడానికి మాత్రమే సరిపోతుంది. మిగిలిన వాటిని ముట్టుకోలేకపోయారు. ఫలితంగా డబ్ల్యూబీఎం రహదారులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం: ఏజెన్సీ ప్రాంతంలోని మార్గాలను తారు రోడ్లుగా మార్చడానికి వీలున్న వాటిని గుర్తించి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. ఆగినవన్నీ తిరిగి ప్రారంభించడానికి అనుమతి కోరుతున్నాం. ఐటీడీఏ పీఓ నుంచి అనుమతులు తీసుకొని పనులు పునఃప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. - జె.శాంతీశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు, గి.సం.ఇంజినీరింగు విభాగం.
పార్వతీపురం మండలంలోని చొక్కాపువానివలస నుంచి గంగమాంబాపురానికి రూ.1.83 కోట్లతో రోడ్డు పనులు 2000 నవంబరులో ప్రారంభించారు. ఖానాలు, మట్టి, రాతిపరుపు పనులు 2021 ఫిబ్రవరికే పూర్తిచేశారు. తరువాత గుత్తేదారు తారు వేయకుండా చేతులెత్తేశారు. ప్రస్తుతం ఆ మార్గం రాళ్లు తేలి ప్రయాణించాలంటే భయమేస్తోంది. ఇదే మండలంలోని తేలునాయుడువలస నుంచి మునక్కాయవలస, కవిటిభద్ర ఆర్ అండ్ బి నుంచి డి.ములగ, డోకిశీల రోడ్డు నుంచి గెంజిగెడ్డ రహదారులదీ ఇదే పరిస్థితి.
కురుపాం మండలంలోని పొడి నుంచి ఒప్పంగికి వెళ్లే దారి. సుమారు రెండు కి.మీ. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పిక్క తెచ్చి వదిలేశారు. రెండేళ్లు పనులు చేయకపోవడంతో కొందరు పిక్కను తరలించేస్తున్నారు. గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను ఉన్నానన్నావ్.. విన్నానన్నావ్.. ఐదేళ్లుగా ఏం చేశావ్!
[ 23-04-2024]
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు. -
ఎస్.కోటను అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. -
పదిలో అయిదో స్థానం
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
వైకాపా పతనం తప్పదు: కళా
[ 23-04-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. -
పార్లమెంటుకు 05 .. అసెంబ్లీకి 24
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి 05, అసెంబ్లీ స్థానాలకు 24 వచ్చాయి. ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ రెండు సెట్ల నామపత్రాలు అందజేశారు. -
కోటలో జనసంద్రం
[ 23-04-2024]
శృంగవరపుకోటలో చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం సభకు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జగ్గంపేట సభ అనంతరం వచ్చిన చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద అభ్యర్థులు శ్రీభరత్, కోళ్ల లలితకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, కార్యదర్శి ఐ.సుధారాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ, భాజపా నియోజకవర్గ కన్వీనర్ జగదీశ్వరి స్వాగతం పలికారు. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలు
[ 23-04-2024]
అరకు పార్లమెంటరీ.. -
నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
[ 23-04-2024]
కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్కుమార్ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. -
ప్రకటనల మోత.. ఏదీ రైలుబస్సు కూత
[ 23-04-2024]
మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్లో రైలు కూత వినిపించకుండా పోయింది. -
ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సామే
[ 23-04-2024]
నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
జగన్ చెప్పారంటే.. చేయరంతే!
[ 23-04-2024]
ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. -
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్ 600కు 592, ఎం.హర్షవర్థన్ 592, కె.రాకేష్ 590 మార్కులు సాధించారు. -
‘ప్రజల్ని దోచేసిన వైకాపా’
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజల కష్టాన్ని అధిక ధరలు, ఛార్జీల రూపంలో దోచేసిందని కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలం కోడూరు, ఏనుగువలస గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM