వారంలో రెండు రోజులేఆయుష్....
జిల్లాలో ఆయుష్ విభాగంలో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వైద్యాధికారులు బదిలీ అయినా, ఉద్యోగ విరమణ చేసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. 2016-17కు ముందు వరకూ ఒక్కో డిస్పెన్షరీలో కనీసం 40కు పైగా ఓపీ ఉండేది.
జిల్లాలో దయనీయ స్థితిలో విభాగం
విజయనగరం వైద్య విభాగం, న్యూస్టుడే: జిల్లాలో ఆయుష్ విభాగంలో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వైద్యాధికారులు బదిలీ అయినా, ఉద్యోగ విరమణ చేసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. 2016-17కు ముందు వరకూ ఒక్కో డిస్పెన్షరీలో కనీసం 40కు పైగా ఓపీ ఉండేది. గడిచిన అయిదేళ్ల కాలంలో ఓపీ తగ్గుతోంది.
ఇదీ పరిస్థితి: జిల్లాలో ఆయుర్వేద విభాగంలో సేవలందించిన సీనియర్ వైద్యాధికారి రెండు నెలల కిందట ఉద్యోగోన్నతిపై విజయవాడకు బదిలీపై వెళ్లగా...అప్పటినుంచి ఈ విభాగం ఖాళీగా ఉంది. భీమవరం నుంచి డెప్యూటేషన్పై వైద్యాధికారిణిని నియమించారు. ఆమె సోమ, శనివారాల్లో మాత్రమే ఇక్కడికి వచ్చి సేవలందిస్తారు. మిగిలిన రోజుల్లో భీమవరంలో అందుబాటులో ఉంటారు. జిల్లాలోని మిగిలిన 41 డిస్పెన్షరీల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. ఇవన్నీ పీహెచ్సీలకు ఆనుకొనే ఉన్నాయి. చాలా వరకు వైద్యులు లేకపోవడంతో వారానికి రెండు, మూడు రోజులు డెప్యూటేషన్పై పంపించి సేవలందిస్తున్నారు. లేనిచోట కాంపౌండర్లే మందులిచ్చి పంపిస్తున్నారు.
ఖాళీల భర్తీకి ప్రకటన ఇచ్చారు. ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. డెప్యూటేషన్ల మీద సేవలందిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. త్వరలో అన్ని విభాగాలకు వైద్యులు, సిబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెల్నెస్ కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల ఉన్నతాధికారులు నివేదిక అడిగారు. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. - శేఖర్, ప్రాంతీయ ఉప సంచాలకులు, ఆయుష్ విభాగం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను ఉన్నానన్నావ్.. విన్నానన్నావ్.. ఐదేళ్లుగా ఏం చేశావ్!
[ 23-04-2024]
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు. -
ఎస్.కోటను అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. -
పదిలో అయిదో స్థానం
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
వైకాపా పతనం తప్పదు: కళా
[ 23-04-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. -
పార్లమెంటుకు 05 .. అసెంబ్లీకి 24
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి 05, అసెంబ్లీ స్థానాలకు 24 వచ్చాయి. ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ రెండు సెట్ల నామపత్రాలు అందజేశారు. -
కోటలో జనసంద్రం
[ 23-04-2024]
శృంగవరపుకోటలో చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం సభకు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జగ్గంపేట సభ అనంతరం వచ్చిన చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద అభ్యర్థులు శ్రీభరత్, కోళ్ల లలితకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, కార్యదర్శి ఐ.సుధారాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ, భాజపా నియోజకవర్గ కన్వీనర్ జగదీశ్వరి స్వాగతం పలికారు. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలు
[ 23-04-2024]
అరకు పార్లమెంటరీ.. -
నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
[ 23-04-2024]
కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్కుమార్ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. -
ప్రకటనల మోత.. ఏదీ రైలుబస్సు కూత
[ 23-04-2024]
మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్లో రైలు కూత వినిపించకుండా పోయింది. -
ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సామే
[ 23-04-2024]
నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
జగన్ చెప్పారంటే.. చేయరంతే!
[ 23-04-2024]
ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. -
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్ 600కు 592, ఎం.హర్షవర్థన్ 592, కె.రాకేష్ 590 మార్కులు సాధించారు. -
‘ప్రజల్ని దోచేసిన వైకాపా’
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజల కష్టాన్ని అధిక ధరలు, ఛార్జీల రూపంలో దోచేసిందని కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలం కోడూరు, ఏనుగువలస గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్