జనవరి జీతాలొస్తాయో.. లేదో!!
ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి తాము సహకరించబోమని ఖజానా శాఖ ఉద్యోగులు శుక్రవారం స్పష్టం చేశారు. దీని వల్ల ఉద్యోగులకు జీతాలు వస్తాయా, రావా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది
ఉద్యమ బాటలో ట్రెజరీ ఉద్యోగులు
డీడీ గణేష్కు నోటీసు అందజేస్తున్న ఖజానా శాఖ ఉద్యోగ సంఘ నాయకులు
కలెక్టరేట్, న్యూస్టుడే: ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి తాము సహకరించబోమని ఖజానా శాఖ ఉద్యోగులు శుక్రవారం స్పష్టం చేశారు. దీని వల్ల ఉద్యోగులకు జీతాలు వస్తాయా, రావా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు 25 వేల మంది, పింఛనర్లు 19 వేల మంది వరకు ఉన్నారు.
ప్రభుత్వం జీవోలు ఉపసంహరించుకునే వరకు తాము విధుల్లో పాల్గొనబోమని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పద్మనాభం, ముదిలి ఆదినారాయణ, పద్మావతి, రామకృష్ణ తదితరులు స్పష్టం చేశారు. ఇదే విషయమై ఉద్యోగులతో సమావేశమైన వీరు.. కొత్త పీఆర్సీ వల్ల ఉన్న జీతంలో కోత పడుతుందని, దీని వల్ల తీవ్రంగా నష్టపోతామని వెల్లడించారు. అనంతరం ఆ శాఖ సహాయ సంచాలకుడు ఎస్ఆర్కే గణేష్కు నోటీసు అందజేశారు. డీడీవోల నుంచి పీఆర్సీ జీతాల స్వీకరణ, ఆన్లైన్ డేటా సమర్పించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు యుగంధర్, కిరణ్కుమార్, ఏపీ ఎన్జీవో నాయకులు జగదీష్ పాల్గొన్నారు.
ఫిట్మెంట్ అమలు చేస్తారా..
ముఖ్యమంత్రి ప్రకటించిన 23.29 శాతం ఫిట్మెంట్ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు అమలు చేస్తారా? లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.అప్పలసూరి, బి.కాంతారావు ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. 8, 9వ పీఆర్సీలో ప్రకటించిన విధంగా మినిమం బేసిక్ పే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత