నమ్మించారు.. నట్టేటా ముంచారు
1224.. కొత్త వరి వంగడం.. చాలా మంచి రకం. దిగుబడి బాగా వస్తుంది. ఇదీ వ్యవసాయ అధికారుల మాట. అంతే జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న రైతులకు ఆ రకం విత్తనం అందించగా మొత్తం 4500 ఎకరాల్లో పండించారు. ఎన్నో ఆశలతో వేయగా 60 వేల టన్నుల దిగుబడి వచ్చింది. తీరా
1224 రకం ధాన్యం కొనక ఇక్కట్లు
జామి, న్యూస్టుడే: 1224.. కొత్త వరి వంగడం.. చాలా మంచి రకం. దిగుబడి బాగా వస్తుంది. ఇదీ వ్యవసాయ అధికారుల మాట. అంతే జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న రైతులకు ఆ రకం విత్తనం అందించగా మొత్తం 4500 ఎకరాల్లో పండించారు. ఎన్నో ఆశలతో వేయగా 60 వేల టన్నుల దిగుబడి వచ్చింది. తీరా అమ్ముకోవడానికి రైతు భరోసా కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్తే ఈ రకం అప్పుడే కొనుగోలు చేయవద్దని అధికారులు తెలిపారని.. కొనలేమని అక్కడి సిబ్బంది అంటున్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక్క జామి మండలంలోనే దాదాపు 270 ఎకరాల్లో ఈ రకాన్ని విత్తారు. చాలామంది రైతులు ఆర్బీకేలకు తిరిగి తిరిగి చేసేది లేక పురులు కట్టి అందులో నిల్వ చేశారు. మరికొందరు ఏ రోజైనా కొనరా అని సంచుల్లో వేసి బస్తాలు సిద్ధంగా ఉంచారు. ఈ రకం ధాన్యం ముక్క అయిపోతుందని.. బియ్యం దిగుబడి రావడం లేదని జిల్లాలో ఏ మిల్లరు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈక్రమంలో అన్నదాతల నుంచి ఎలా తీసుకోవాలో.. ఎవరికి అమ్మాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. చాలా మంది తమ ధాన్యం కొనుగోలు చేయాలని జేసీ నుంచి మండల స్థాయి అధికారుల వరకు అడుగుతున్నా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో కర్షకులు అప్పుల పాలయ్యేలా ఉన్నారు.
207 బస్తాలు ఉన్నాయి..
నేను అధికారుల మాట విని కొత్త రకం విత్తనం కదా అని 11 ఎకరాల్లో వేశా. మొత్తం 207 బస్తాల దిగుబడి వచ్చింది. అమ్మేందుకు రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా సరైన సమాధానం ఉండటం లేదు. రైతు సలహా మండలి అధ్యక్షుడిగా నేను వేయడమే కాకుండా మండలంలో చాలా మందితో ఈ విత్తనం నాటించాను. వారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నా. అధికారులు ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలి.- గేదెల రమణబాబు, రైతు, భీమసింగి,జామి మండల రైతు సలహా మండలి అధ్యక్షుడు
జేసీ దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలో 1224, మరికొన్ని సన్నాలు కలిపి 60 వేల టన్నులు ధాన్యం ఉంది. వీటిని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. ఈ సమస్యను జేసీ దృష్టికి రాతపూర్వకంగా తెలియజేశాం. ఆయన ఆదేశాల మేరకు వీలైనంత త్వరలో కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.
- టి.రామారావు, జేడీఏ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)