logo

ఇద్దరు బాల నేరస్థులు అరెస్టు

నగరంలో ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున డి.కిరణ్‌ కుమార్‌ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు బాల నేరస్థులను రెండో పట్టణ పోలీసులు శనివారం.....

Updated : 22 Jan 2022 16:07 IST

రింగురోడ్డు: నగరంలో ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున డి.కిరణ్‌ కుమార్‌ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు బాల నేరస్థులను రెండో పట్టణ పోలీసులు శనివారం ఉదయం అంబటిసత్రం కూడలివద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను అదనపు ఎస్పీ అనిల్‌ కుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరపాలక సంస్థలో వాహన ఛోదకుడిగా పనిచేస్తున్న డి.కిరణ్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు నగరానికి చెందిన 17ఏళ్ల బాలుడు కాగా, మరొకరు కాకినాడ ప్రాంతానికి చెందిన మైనర్‌గా అదనపు ఎస్పీ తెలిపారు. ఇద్దరూ పాత నేరస్థులే అని.. జువైనల్‌ హోమ్‌లో కలిసి పెరిగినట్లు వివరించారు. సమావేశంలో సీఐ లక్ష్మణరావు, ఎస్సై సాగర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని