logo

ఈబీసీ నేస్తం అందజేత

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద జిల్లాలో 5,470 మందికి రూ.8.21 కోట్ల చెక్కును కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, ప్రజాప్రతినిధులు మంగళవారం అందజేశారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి దూరదృశ్య సమావేశం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా నుం

Published : 26 Jan 2022 06:22 IST


లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న జడ్పీ ఛైర్మన్‌, కలెక్టర్‌

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద జిల్లాలో 5,470 మందికి రూ.8.21 కోట్ల చెక్కును కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, ప్రజాప్రతినిధులు మంగళవారం అందజేశారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి దూరదృశ్య సమావేశం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా నుంచి జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, సురేష్‌బాబు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జేసీ జె.వెంకటరావు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని