logo

వాడవాడలా గణతంత్ర వేడుకలు

బలిజిపేట మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు....

Updated : 26 Jan 2022 15:37 IST

బలిజిపేట: బలిజిపేట మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసు స్టేషన్‌లో ఎస్సై పాపారావు, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో త్రినాథరావు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ నాగమణి, తహసీల్దారు కార్యాలయంలో వరప్రసాద్‌, చిలకలపల్లి విద్యుత్‌శాఖ కార్యాలయంలో ఏఈ సింహాచలం జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయగీతం ఆలపించిన విద్యార్థులకు బహుమతులు, మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు రవికుమార్‌, మండలపరిషత్‌ ఉపాధ్యక్షులు హేమలత, సాయిరామ్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు